News October 4, 2024

MDK: మొదలైన సందడి.. నామినేటెడ్ ఆశలు?

image

మెదక్ జిల్లాలో ప్రస్తుతం గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, దేవాదాయ శాఖ, మార్కెట్ కమిటీ, ఆత్మ కమిటీ పాలక మండళ్లు ఖాళీగా ఉన్నాయి. మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, మంత్రి దామోదర్ రాజనరసింహ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పదవులు భర్తీ గురించి చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంతో జిల్లాలోని ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Similar News

News September 16, 2025

మెదక్: ‘బాల్యం అనేది చదువుకోవడానికే’

image

బాల్యం అనేది చదువుకోవడానికి, కలలు కనడానికి, భవిష్యత్ నిర్మించుకోవడానికి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఆర్.ఎం.శుభవల్లి అన్నారు. హవేలీ ఘనపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అమూల్యమైన దశ, వయస్సులోనే వివాహం జరగడం వలన బాలల ఆరోగ్యం, విద్య అన్ని దెబ్బతింటాయన్నారు. చిన్న వయస్సులో వివాహం జరపొద్దని సూచించారు.

News September 16, 2025

మెదక్: అత్యధికంగా రేగోడ్‌లో 12.5 సెంమీల వర్షం

image

మెదక్ జిల్లాలో అత్యధికంగా రేగోడ్‌లో 12.5 సెంమీల వర్షం కురిసింది. సోమవారం రాత్రి కుండపోత మాదిరిగా వర్షం కురవడంతో మెదక్ పట్టణం చెరువును తలపించింది. కాగా జిల్లాలో పలు చోట్ల ఉదయం 8 గంటల వరకు వర్షపాత వివరాలు.. మినుపూర్ 108 మిమీ, కొల్చారంలో 102 మిమీ, మెదక్ పట్టణంలో 71 మిమీ, లింగాయిపల్లిలో 71 మిమీ, టేక్మాల్ 59.5 మిమీ వర్షం కురిసింది.

News September 16, 2025

మాసాయిపేట: అనారోగ్యంతో విద్యార్థిని మృతి

image

మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని భవాని అనారోగ్యంతో మృతి చెందింది. అనారోగ్యం కారణంగా ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడంతో ఆమె చనిపోయినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. మాసాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న భవాని సాఫ్ట్‌బాల్ క్రీడలో చురుకుగా ఉండేది. ఆమె మృతి పట్ల ఉపాధ్యాయులు, స్నేహితులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.