News April 12, 2025
MDK: రాజీవ్ యువ వికాసం.. ఈనెల 14 వరకే ఛాన్స్

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం పథకం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. శుక్రవారం వరకు మెదక్ జిల్లాలో 16వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 14 వరకు ఛాన్స్ ఉన్నందున ఈ అవకశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.
Similar News
News April 13, 2025
సిద్దిపేట: బాలల అశ్లీల వీడియోలు పోస్ట్.. యువకుడి అరెస్ట్

సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలు చూసినా, ఇతరులకు షేర్ చేసినా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని దుబ్బాక పోలీసులు తెలిపారు. మిరుదొడ్డి మండలానికి చెందిన యువకుడు అశ్లీల చిత్రాలు చూస్తూ SMలో పోస్ట్ చేశాడు. గుర్తించిన సైబర్ సెక్యూరిటీ అధికారులు అతడిని రిమాండ్ చేసి.. ఫోన్, సిమ్ కార్డ్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. లైక్ల కోసం వీటిని పోస్ట్ చేయొద్దని, SMని మంచికోసం వాడాలని సూచించారు.
News April 13, 2025
సంగారెడ్డి: మహిళపై అత్యాచారం

ఫోన్లో పరిచయమైన ఓ వ్యక్తి మహిళను అత్యాచారం చేసిన ఘటన వట్ పల్లిలో శనివారం జరిగింది. ఎస్ఐ విఠల్ వివరాలు.. మండలంలోని పల్వట్లకు చెందిన ఓ వివాహిత(35)తో ఫోన్లో పరిచయం పెంచుకున్న వ్యక్తి జోగిపేటకు వచ్చిన ఆమెను అల్లాదుర్గం మండలం బహిరన్ దిబ్బ సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం మహిళ మెడలో ఉన్న రెండు తులాల పుస్తెల తాడు, ఫోన్ తీసుకుని పరారయ్యాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News April 13, 2025
గజ్వేల్: పాముకాటుతో వ్యక్తి మృతి

పాముకాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన గజ్వేల్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మండలంలోని శ్రీగిరి పల్లికి చెందిన పాండవుల శ్రీనివాస్(37) తన వ్యవసాయ బావి వద్ద వరి పొలంలో పనులు నిర్వహిస్తుండగా పాముకాటుకు గురై మృతి చెందాడు. కాగా మృతుడికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. శ్రీనివాస్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.