News September 15, 2024
MDK: సమన్యాయం కాంగ్రెస్తోనే సాధ్యం: మంత్రి
అన్ని వర్గాలకు సమన్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నూతన టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి, సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గౌడ్, సిద్దిపేట ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణతో కలిసి ఆయన గాంధీభవన్కు బయలుదేరారు.
Similar News
News September 29, 2024
రాష్ట్రపతి నిలయం కళా మహోత్సవానికి వర్గల్ నవోదయ విద్యార్థులు
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జరిగిన అతిపెద్ద కళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్గల్ జవహర్ నవోదయ విద్యార్థులు 25 మంది పాల్గొన్నారని ప్రిన్సిపల్ రాజేందర్ తెలిపారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు భారతీయ కళా మహోత్సవంలో 430 మంది పాల్గొంటున్నారు.
News September 29, 2024
సంగారెడ్డి: DSC అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు పొడిగింపు
డీఎస్సీ -2008కి ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు పెంచుతున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రభుత్వ పనిదినాలైన సెప్టెంబర్ 30, అక్టోబర్ 1,3,4,5 తేదీల్లో డిఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
News September 28, 2024
MDK: డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్.. నేడు లాస్ట్
డీఎస్సీ అభ్యర్థులను ఎస్జీటీ కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విధితమే. సంగారెడ్డిలోని డీఈఓ కార్యాలయంలో 2008 డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 292 మంది అభ్యర్థులు ఉండగా, శుక్రవారం 132 మంది వెరిఫికేషన్కు హాజరయ్యారు. నేడు కూడా ప్రక్రియ కొనసాగనున్నది.