News March 18, 2024

MDK: హరీశ్‌రావు వ్యూహం.. BRS గెలుస్తుందా?

image

ఉమ్మడి మెదక్ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాల్లో BRS జెండా ఎగరేసేందుకు ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఈసారి గెలుపే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తున్నట్లు శ్రేణులు చెబుతున్నాయి. మరి హరీశ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా చూడాలి.

Similar News

News January 26, 2026

మెదక్: ‘న్యాయం జరిగితేనే రాజ్యాంగానికి సార్ధకత’

image

ప్రతి బాధితుడికి న్యాయం జరిగితేనే రాజ్యాంగానికి సార్థకత అని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలు, ఆశయాలకు లోబడి బాధ్యతాయుత పౌరులుగా జీవించాలన్నారు. మెదక్ క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. మాతృభూమి కోసం ఎందరో మహానీయులు తమ ప్రాణాలను త్యాగప్రాయంగా అర్పించిన ఫలితంగా మనకు భారత రాజ్యాంగం లభించిందని తెలిపారు.

News January 26, 2026

చేగుంట: వన్యప్రాణుల లెక్క తేలింది

image

చేగుంట మండలం ఇబ్రహీంపూర్ బీట్ పరిధి చిట్టోజి పల్లి అటవీ ప్రాంతంలో అఖిలభారత అటవీ జంతువుల గణన పూర్తయినట్లు అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీత అగర్వాల్ తెలిపారు. పులులు, జింకలు, అడవి పందులు, నక్కలు, హైనా, కోతులు, కుందేళ్లు, ఉడుతలు, నెమళ్లు, అడవి కోళ్ళు, పావురాలు, గద్దలు, గుడ్లగూబలు, సర్పాలు, పాములు, ఉభయచర ఉనికి, సంఖ్య, సంచార మార్గాలను నమోదు చేసినట్లు తెలిపారు.

News January 25, 2026

పటాన్‌చెరులో యాక్సిడెంట్.. ఇద్దరు దుర్మరణం

image

పటాన్‌చెరు పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. ముత్తంగి జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టినట్లుగా సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.