News March 16, 2024
MDK: విషాదం.. రైతు మృతి

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్లో విషాదం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మొంగల లక్ష్మయ్య(55) శనివారం తన వ్యవసాయ పొలం వద్ద బోరు మోటారు వేసేందుకు వెళ్లాడు. స్టార్టర్ నడవకపోవడంతో దానిని రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Similar News
News September 2, 2025
చిన్నశంకరంపేట: అనుమానాస్పదంగా వివాహిత మృతి

అనుమానాస్పదంగా వివాహేత మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేటలో మంగళవారం జరిగింది. ఎస్సై నారాయణ తెలిపిన వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన వానరాశి రాధిక(19) ఇంట్లో అనుమానాస్పదంగా ఉరేసుకుంది. స్థానికుల సమచారంతో 108 సిబ్బంది మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి అమ్మమ్మ లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఎస్సై తెలిపారు.
News September 2, 2025
శాశ్వత పరిష్కారం కోసం చర్యలు: కలెక్టర్ రాహుల్ రాజ్

భవిష్యత్తులో జిల్లాలో భారీ విపత్తులను అధిగమించే విధంగా శాశ్వత పరిష్కారం దిశగా నిర్మాణాలు చేపట్టేలా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం చేగుంట మండల కేంద్రంలో అనంతసాగర్లో వర్షాల తాకిడికి దెబ్బతిన్న ఇళ్లను, ఇబ్రహీంపూర్లో తెగిన రోడ్డు, ఇతర నష్టం వాటిల్లగా సంబంధిత రెవెన్యూ, పంచాయతీరాజ్, హౌసింగ్ అధికారులతో పర్యటించారు.
News September 2, 2025
మెదక్: డీవైఎస్ఓ దామోదర్ రెడ్డి బదిలీ.. డీఈఓకే బాధ్యత

మెదక్ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి దామోదర్ రెడ్డి మేడ్చల్ జిల్లాకు బదిలీ అయ్యారు. గతేడాది జులైలో బదిలీపై రాగా ఇప్పటి వరకు విధులు నిర్వహించారు. దామోదర్ రెడ్డి బదిలీ కాగా జిల్లా విద్యాధికారి రాధాకిషన్కు డీవైఎస్ఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇన్ఛార్జ్ మెదక్ డీఈఓగా ఉన్న ప్రొ.రాధాకిషన్ కు డైట్ ప్రిన్సిపల్ బాధ్యతలు అదనంగా అప్పగించారు. తాజాగా డీవైఎస్ఓగా బాధ్యతలు అప్పగించారు.