News March 19, 2025
MDP: యనమలకు రాజ్యసభ ఇవ్వాలన్న ఎమ్మెల్సీ తోట

శాసన మండలిలో ఏడుగురు ఎమ్మెల్సీల పదవీ కాలపరిమితి ముగియనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం శాసన మండలిలో వారికి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ..వివిధ విభాగాల్లో నిష్ణాతులైన వారి సేవలు ప్రభుత్వాలు ఇప్పటి వరకు వినియోగించుకున్నాయని పేర్కొన్నారు. తనకి అత్యంత సన్నిహితుడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వివిధ శాఖల మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడుకు రాజ్యసభ పదవి ఇవ్వాలని తోట కోరారు.
Similar News
News November 18, 2025
ఫోన్ పోయిన వెంటనే ఫిర్యాదు చేయాలి: ASF ఎస్పీ

మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారు వెంటనే CEIR వెబ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ASF జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. మంగళవారం ASF ఎస్పీ కార్యాలయంలో సెయిర్ వెబ్ పోర్టల్ ద్వారా స్వాధీనం చేసుకున్న 41 మొబైల్ ఫోన్లను బాధితులకి అప్పగించారు. ప్రతి ఒక్కరికి మొబైల్ అనేది తప్పనిసరి వస్తువు అయిందన్నారు. ప్రతి చిన్న పనితో పాటు యూపీఐ లావాదేవీలకి సైతం మొబైల్ ప్రధానమన్నారు.
News November 18, 2025
ఫోన్ పోయిన వెంటనే ఫిర్యాదు చేయాలి: ASF ఎస్పీ

మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారు వెంటనే CEIR వెబ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ASF జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. మంగళవారం ASF ఎస్పీ కార్యాలయంలో సెయిర్ వెబ్ పోర్టల్ ద్వారా స్వాధీనం చేసుకున్న 41 మొబైల్ ఫోన్లను బాధితులకి అప్పగించారు. ప్రతి ఒక్కరికి మొబైల్ అనేది తప్పనిసరి వస్తువు అయిందన్నారు. ప్రతి చిన్న పనితో పాటు యూపీఐ లావాదేవీలకి సైతం మొబైల్ ప్రధానమన్నారు.
News November 18, 2025
‘బాపట్ల జిల్లాలో రైతులకు రూ.26.98 కోట్ల ఆర్థిక సహాయం’

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రెండో విడత ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. ఈనెల 19న జరిగే ఈ కార్యక్రమాన్ని అన్ని స్థాయిలలో ఆధికారులు సమన్వయంతో నిర్వహించాలన్నారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో ప్రసార ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 1.60 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.26.98 కోట్ల ఆర్థిక సహాయం జమ కానుందని తెలిపారు.


