News March 19, 2025
MDP: యనమలకు రాజ్యసభ ఇవ్వాలన్న ఎమ్మెల్సీ తోట

శాసన మండలిలో ఏడుగురు ఎమ్మెల్సీల పదవీ కాలపరిమితి ముగియనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం శాసన మండలిలో వారికి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ..వివిధ విభాగాల్లో నిష్ణాతులైన వారి సేవలు ప్రభుత్వాలు ఇప్పటి వరకు వినియోగించుకున్నాయని పేర్కొన్నారు. తనకి అత్యంత సన్నిహితుడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వివిధ శాఖల మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడుకు రాజ్యసభ పదవి ఇవ్వాలని తోట కోరారు.
Similar News
News October 19, 2025
కొల్లాపూర్ పీజీ సెంటర్లో ఎంబీఏ స్పాట్ అడ్మిషన్లు

కొల్లాపూర్ పీజీ సెంటర్ (పాలమూరు విశ్వవిద్యాలయం)లో ఎంబీఏ మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మార్క్ పోలోనియస్ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 21, 2025 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, ఒరిజినల్ టీసీతో కొల్లాపూర్ పీజీ సెంటర్కు రావాలని ఆయన కోరారు. పూర్తి వివరాలకు 9908740482ను సంప్రదించాలని పేర్కొన్నారు.
News October 19, 2025
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక ధన్వంతరీ ఆలయం

తూ.గో. జిల్లాలోని చింతలూరు గ్రామంలో ధన్వంతరి స్వామి ఆలయం ఉంది. ఇక్కడ కాశీ ఏకశిలతో మలచిన పాలరాతి విగ్రహ రూపంలో స్వామివారు కొలువై ఉంటారు. నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, అమృత కలశం, జలగ ధరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని దర్శిస్తే సమస్త రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడే కాకుండా శ్రీరంగం రంగనాథ ఆలయం, కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయం, కేరళలోని గురువాయూర్ సమీపంలో కూడా ధన్వంతరి ఆలయాలు ఉన్నాయి.
News October 19, 2025
ఎలాంటి గొర్రెలు కొంటే ఎక్కువ ప్రయోజనం?

ఆడ గొర్రెలు ఏడాదిన్నర వయసు, 8-10 కిలోల బరువు.. పొట్టేలు రెండేళ్ల వయసు, 10- 15 కిలోల బరువు ఉండాలి. రైతుల మంద నుంచి గొర్రెలు కొనడం మంచిది. రెండు ఈతలకు మధ్య ఎక్కువ సమయం తీసుకునే గొర్రెలు వద్దు. చూడి, మొదటిసారి ఈనిన గొర్రెలను కొంటే మంద పెరిగే ఛాన్సుంది. విత్తనపు పొట్టేలు, బలంగా, ఎత్తుగా ఉండి.. ఎక్కువ పిల్లలకు జన్మనిచ్చే సామర్థ్యంతో ఉండాలి. మందలో ప్రతీ 30 ఆడ గొర్రెలకు ఒక విత్తనపు పొట్టేలు ఉండాలి.