News March 5, 2025
ప్రభుత్వ హాస్టళ్లలో బీపీటీ రైస్తో భోజనం: మంత్రి స్వామి

AP: వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో బీపీటీ రైస్తో భోజనం అందించనున్నట్లు మంత్రి డీబీవీ స్వామి అసెంబ్లీలో తెలిపారు. వసతి గృహాల్లో ఆర్వో ప్లాంటు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన విద్య, భోజనం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పోస్టుమెట్రిక్ విద్యార్థులకు కార్పెట్ బెడ్ షీట్లు, టవళ్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు.
Similar News
News March 4, 2026
పుట్టిన నగరంలోనే ఖమేనీ ఖననం?

ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇరాన్లోని మషాద్లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఖమేనీ పుట్టినిల్లు అయిన ఈ మషాద్ టెహ్రాన్ తర్వాత ఇరాన్లోనే అతిపెద్ద నగరం. ఇక్కడి ప్రఖ్యాత ఇమామ్ రెజా ష్రైన్లోనే ఖమేనీ తండ్రి సమాధి ఉంది. ఖమేనీకి సైతం ఇక్కడే అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. కాగా ఈ ఇమామ్ రెజా ష్రైన్ షియా ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. ఏటా ఈ ప్రాంతాన్ని 3 కోట్ల మంది సందర్శిస్తారు.
News March 4, 2026
అమెరికా-ఇరాన్ పోరుపై RGV ట్వీట్

మిడిల్ఈస్ట్ను ఉద్రిక్త పరిస్థితుల్లోకి నెట్టేసిన అమెరికా-ఇరాన్ పోరుపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం జీసస్ – అల్లాకు మధ్య జరుగుతున్న పోరుగా పేర్కొన్న RGV.. ఎవరు గెలిస్తే వారి మతంలోకి మారుతానన్నారు. అమెరికాలో మెజార్టీ క్రిస్టియన్లు ఉండటం, ఇరాన్ ఇస్లామిక్ కంట్రీ కావడంతో ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరు అన్నట్లుగా వర్మ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
News March 4, 2026
రానున్నాయ్ మహిళా పెట్రోల్ బంకులు

TG: ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. ‘ఇందిరా మహిళాశక్తి’ కింద వీటిని నెలకొల్పుతారు. జిల్లా యంత్రాంగం ఈ పెట్రోలు బంకులకు అవసరమైన భూమిని 30 ఏళ్ల లీజుకు కేటాయిస్తూ ప్రతిపాదనల్ని మెప్మాకు అందించాలి. ALF, TLFలు వీటికి నిధులు సమకూరుస్తాయి. ఆయిల్ కంపెనీలు, లీగల్ మెట్రాలజీ ఇలా వివిధ ప్రొసీజర్లు పూర్తి చేయాలి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే దీని లక్ష్యం.


