News August 2, 2024
ఒలింపిక్స్లో మెడల్స్.. ఏడింతలు పెరిగిన బ్రాండ్ వాల్యూ!

ఒలింపిక్స్లో సంచలనం సృష్టించిన భారత క్రీడాకారిణి మను భాకర్ ఇమేజ్ను వాడుకునేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఒలింపిక్స్ మెడలిస్ట్తో ప్రకటనల కోసం దాదాపు 40 బ్రాండ్స్ ఆమె టీమ్ను సంప్రదించాయట. ఇప్పుడు ఆమె బ్రాండ్ వాల్యూ కూడా భారీగా పెరిగిందని, గతంలో రూ.20 లక్షలు ఉంటే ఇప్పుడు రూ.1.5 కోట్లకు పెరిగినట్లు సమాచారం. కాగా, అనధికారికంగా తన ఫొటోను వాడుకున్న కంపెనీలకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
Similar News
News January 25, 2026
నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్లో పోస్టులు

<
News January 25, 2026
ఆదివారం రోజున ఈ పనులు చేస్తున్నారా?

ఆదివారం, సప్తమి రోజుల్లో కొన్ని పనులు చేస్తే సూర్య దోషం కలగవచ్చని పండితులు చెబుతున్నారు. ‘మద్యమాంసాలు ముట్టకూడదు. క్షురకర్మ చేసుకోకూడదు. తలస్నానానికి నూనె వాడకూడదు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం అశుభం. తోలు వస్తువుల వాడకాన్ని తగ్గించాలి. సూర్యాస్తమయానికి ముందే తినేయాలి. ఆ తర్వాత చేసే భోజనం ఆరోగ్యపరంగా మంచిది కాదు. ఈ నియమాలు అతిక్రమిస్తే దారిద్ర్యం, అనారోగ్యం, కంటి సమస్యలు వచ్చే అవకాశముంది’ అంటున్నారు.
News January 25, 2026
థాంక్యూ ఇండియా: ఇరాన్

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC)లో తమకు అండగా నిలిచినందుకు ఇండియాకు ఇరాన్ థాంక్స్ చెప్పింది. ‘మాకు మద్దతు ఇచ్చినందుకు ఇండియాకు కృతజ్ఞతలు. న్యాయం, జాతీయ సార్వభౌమత్వం విషయంలో ఆ దేశ వైఖరికి ఇది నిదర్శనం’ అని ఇరాన్ రాయబారి మహ్మద్ ఫథాలీ అన్నారు. కాగా శాంతియుత నిరసనలను ఇరాన్ ప్రభుత్వం అణచేస్తోందంటూ UNHRC 39వ ప్రత్యేక సెషన్లో ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది.


