News September 23, 2025
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి: CM

TG: మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు ఇవ్వాలని కేంద్రాన్ని CM రేవంత్ కోరారు. మేడారంలో మొక్కులు చెల్లించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘సమ్మక్క-సారలమ్మ గద్దెల పునః నిర్మాణం చేపట్టడం మాకు దక్కిన గొప్ప అవకాశం. ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం. రామప్ప ఆలయం స్ఫూర్తిగా రాతి కట్టడాలు నిర్మిస్తాం. కుంభమేళాకు ₹వేల కోట్లు కేటాయించిన కేంద్రానికి మేడారం జాతరపై వివక్ష ఎందుకు’ అని ప్రశ్నించారు.
Similar News
News September 23, 2025
వన్డేల్లో కోహ్లీ ఆడతారా? ఆడరా?

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో కొనసాగడంపై అనుమానాలు నెలకొన్నాయి. వచ్చే నెలలో AUSతో వన్డే సిరీస్కు ముందు AUS-Aతో ODI సిరీస్లో ఆడాలని రోహిత్, కోహ్లీకి BCCI సూచించినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రోహిత్ ప్రాక్టీస్ మొదలెట్టగా, BCCIకి కోహ్లీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని సమాచారం. దీంతో ఆయన ఆడటంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం విరాట్ తన ఫ్యామిలీతో లండన్లో ఉంటున్నారు.
News September 23, 2025
YCP ప్రభుత్వంలో పెట్టిన తప్పుడు కేసులపై త్వరలో నిర్ణయం: అనిత

AP: గత ప్రభుత్వంలో రాజకీయ నేతలు, మీడియా, అమరావతి ఉద్యమకారులపై పోలీసులు పెట్టిన కేసులపై CM త్వరలో సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని హోంమంత్రి అనిత కౌన్సిల్లో ప్రకటించారు. ‘YCP ప్రభుత్వం 2019-24 మధ్య 3116 తప్పుడు కేసులు నమోదు చేసింది. న్యాయమడిగినా, తప్పులను ఎత్తి చూపినా కేసులు పెట్టారు. నాపైనా అట్రాసిటీ కేసు పెట్టారు’ అని పేర్కొన్నారు. న్యాయ, పోలీసు శాఖలతో చర్చించి వీటిని పరిష్కరిస్తామని తెలిపారు.
News September 23, 2025
ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించింది ఎందరో తెలుసా?

దేశంలో 142.21 కోట్ల జనాభా ఉంటే అందులో 3.51 కోట్ల మందే FY2024-25లో ఆదాయ పన్ను చెల్లించినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 51.69కోట్ల మంది పాన్ & ఆధార్ లింక్ చేశారని, అందులో 7.20 కోట్ల మంది ITR దాఖలు చేసినట్లు ట్వీట్స్ చేస్తున్నారు. కేవలం 4శాతం మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని పేర్కొంటున్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో 50% మంది పన్ను చెల్లిస్తారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.