News January 21, 2025

ఆ పెన్షన్ దారులందరికీ వైద్య పరీక్షలు

image

AP: దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు, చేతులు దెబ్బతినడంతో రూ.6వేలు పెన్షన్ పొందుతున్నవారికి ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు చేసి అనర్హులను తొలగించనుంది. రాష్ట్రంలోని సుమారు 7లక్షల మంది లబ్ధిదారుల్లో 40% అనర్హులు ఉండొచ్చని అంచనా. అవయవాలు బాగానే ఉన్నా ఫేక్ సర్టిఫికెట్లతో ఇన్నాళ్లూ డబ్బులు తీసుకున్నవారి పెన్షన్ కట్ కానుంది.

Similar News

News November 3, 2025

టిప్పర్ డ్రైవర్ గుర్తింపు

image

TG: రంగారెడ్డి జిల్లాలో <<18184089>>బస్సు ప్రమాదానికి<<>> కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. అతడు మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ అని వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లచ్చానాయక్ దగ్గర డ్రైవర్‌గా పని చేస్తున్నాడని తెలిపారు. హైదరాబాద్ శివారు పటాన్‌చెరులోని క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్‌కు కంకర తీసుకెళ్తుండగా మీర్జాగూడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆకాశ్ కూడా చనిపోయాడు.

News November 3, 2025

US ఆంక్షల ఎఫెక్ట్.. చైనా మాస్టర్ ప్లాన్!

image

రష్యా ఆయిల్ కంపెనీలపై US ఆంక్షల నేపథ్యంలో చైనా తమ చమురు నిల్వలను భారీగా పెంచుకుంటోంది. 2025లో తొలి 9 నెలల్లో చైనా రోజుకు 11M బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇందులో 1-1.2M బ్యారెళ్లను నిల్వల కోసం దారి మళ్లించినట్లు వివరించింది. చమురు అవసరాల కోసం ఆ దేశం 70% విదేశాలపైనే ఆధారపడుతోంది. చైనా చమురు నిల్వల సామర్థ్యం 2 బిలియన్ బ్యారెళ్లకు పైగా ఉందని అంచనా.

News November 3, 2025

అడగడానికి ఇంకేం ప్రశ్నలే లేవా.. మీడియాపై సిద్దరామయ్య ఆగ్రహం

image

కర్ణాటకలో సీఎం మార్పు గురించి ఇటీవల జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని మీడియా ప్రశ్నించగా CM సిద్దరామయ్య సీరియస్ అయ్యారు. ‘అడగడానికి ఇంకేం ప్రశ్నలు లేవా? ప్రజలు తమకు నచ్చిన దాని గురించి మాట్లాడుకోనీయండి. హైకమాండ్ ఎవరు? సోనియాగాంధీ, రాహుల్, మల్లికార్జున ఖర్గే చెప్పారా దీని గురించి’ అని ప్రశ్నించారు. బిహార్ ఎన్నికల తర్వాత క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణపై అధిష్ఠానంతో మాట్లాడతానని తెలిపారు.