News August 17, 2024

నేడు దేశవ్యాప్తంగా వైద్యసేవలు బంద్

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. నేటి ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వైద్యసేవలు నిలిపేస్తున్నట్లు ఐఎంఏ తెలిపింది. అత్యవసర వైద్యసేవలు మాత్రమే పని చేస్తాయని ప్రకటించింది. కాగా ట్రైనీ డాక్టర్ హత్య కేసులో నిందితులను శిక్షించాలని వైద్యులు నిరసన తెలుపుతున్నారు. ఇవాళ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో వారు భేటీ కానున్నారు.

Similar News

News December 4, 2025

నవాబుపేట మండలంలోని అత్యధిక ఏకగ్రీవాలు

image

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మొదటి విడతలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని నవాబుపేట మండలంలో అత్యధికంగా ఏకగ్రీవాలు జరిగాయి. మండలంలోని కాకర్జాల పల్లె గడ్డ, పుట్టోని పల్లి గ్రామపంచాయతీలు ఏకగ్రీవమైన అధికారులు వెల్లడించారు. గండీడ్ మండలంలో అంచనపల్లి, మన్సూర్ పల్లి, మహమ్మదాబాద్ మండలంలోని ఆముదాల గడ్డ, రాజాపూర్ మండలంలోని మోత్కులకుంట తండా ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

News December 4, 2025

రైతన్నా.. పంట వ్యర్థాలను తగలబెట్టొద్దు

image

పంటకాలం పూర్తయ్యాక చాలా మంది రైతులు ఆ వ్యర్థాలను తగలబెడుతుంటారు. వీటిని తొలగించడానికి అయ్యే ఖర్చును భరించలేక ఇలా చేస్తుంటారు. అయితే దీని వల్ల నేల సారం దెబ్బతినడంతో పాటు పంటకు మేలు చేసే కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వానపాములు, నులిపురుగులు నాశనమవుతాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గుతుంది. ఈ వ్యర్థాలను పంటకు మేలు చేసే ఎరువులుగా మార్చే సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 4, 2025

పాక్ దివాలా.. అమ్మకానికి జాతీయ ఎయిర్‌లైన్స్

image

IMF ప్యాకేజీ కోసం తమ జాతీయ ఎయిర్‌లైన్స్‌ను అమ్మడానికి పాకిస్థాన్ సిద్ధమైంది. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(PIA) బిడ్డింగ్ ఈ నెల 23న జరుగుతుందని ఆ దేశ ప్రధాని షరీఫ్ ఓ ప్రకటనలో చెప్పారు. ‘PIAలో 51-100% విక్రయించడం అనేది IMF $7 బిలియన్ల ఆర్థిక ప్యాకేజీ కోసం నిర్దేశించిన షరతులలో భాగం. ఈ సేల్‌కు ఆర్మీ నియంత్రణలోని ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ కూడా ముందస్తు అర్హత సాధించింది’ అని అక్కడి మీడియా చెప్పింది.