News December 9, 2024
అందుబాటులోకి ‘మీ సేవ’ మొబైల్ యాప్

TG: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘మీ సేవ’ మొబైల్ యాప్ను మంత్రి శ్రీధర్ బాబు లాంచ్ చేశారు. ఈ యాప్ ద్వారా ఇంటి నుంచే 150 రకాల సేవలు పొందవచ్చు. కులం, ఆదాయం, జనన ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు. బిల్లుల చెల్లింపులు చేయవచ్చు. ఈ యాప్తో పాటు ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే టీ ఫైబర్ నెట్ సేవలనూ ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా పెద్దపల్లి, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో అమలు చేయనుంది.
Similar News
News December 30, 2025
అడవి తల్లిబాట: అప్పుడు.. ఇప్పుడు!

AP: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంతో గిరిజన ప్రాంతాల్లో వేగంగా రోడ్లు వేస్తున్నారు. డోలీ మోతల కష్టాలను తొలగించేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 7న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాలో దీన్ని ప్రారంభించారు. ఇందుకోసం రూ.1,005 కోట్లు కేటాయించారు. తాజాగా పంచాయతీ, రూరల్ డెవలప్మెంట్ కార్యదర్శి కృష్ణతేజ పాత, కొత్త ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
News December 30, 2025
‘వైకుంఠ ఏకాదశి వ్రత విధానం.. (2/2)

పండ్లు మాత్రమే తిని, జాగరణ చేయాలి. భజనలు, ధ్యానం చేస్తూ మనసును పవిత్రంగా ఉంచుకోవాలి. ఎవరినీ దూషించకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసి, విష్ణువును పూజించాలి. వీలైతే అన్నదానం చేసి, శక్తి కొద్దీ దక్షిణ సమర్పించాలి. ఆ తర్వాతే భోజనం చేసి ఉపవాసం విరమించాలి. ఈ విధంగా నియమ నిష్టలతో రోజులు వ్రతాన్ని ఆచరిస్తే శ్రీహరి అనుగ్రహంతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
News December 30, 2025
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి టోల్ ఫ్రీ?

TG: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఊరట కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైవేలపై వెళ్లే వాహనాల టోల్ ఛార్జీలను భరించాలని అనుకుంటున్నట్లు సమాచారం. టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో చిక్కుకోకుండా ఉపశమనం కల్పించాలని నిర్ణయించినట్లు టాక్. దీనికి కేంద్రం అనుమతిస్తే ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, విజయవాడ మార్గాల్లో వెళ్లే వారికి ప్రయోజనం కలగనుంది.


