News January 28, 2025

మీర్‌పేట్ హత్య.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

image

TG: మీర్‌పేట్ హత్య కేసులో రాచకొండ సీపీ సుధీర్ బాబు కీలక విషయాలు వెల్లడించారు. ఆర్మీలో పనిచేసిన గురుమూర్తి స్వతహాగానే క్రూరుడని పేర్కొన్నారు. పిల్లలు అమ్మ ఏదని అడిగితే గొడవపడి ఎక్కడికో వెళ్లిందని చెప్పినట్లు తెలిపారు. ఎక్కడా ఆధారాలు దొరకకుండా ప్లాన్ చేశాడని, సిబ్బంది కష్టపడి సాంకేతిక ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్నారు.

Similar News

News October 31, 2025

ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ

image

AP: ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్‌తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వెంటనే మరో రూ.250 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. నవంబర్ చివరికల్లా మొత్తం బకాయిలు ఒకే వాయిదాలో చెల్లిస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆందోళన విరమించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరించేందుకు నెట్వర్క్ ఆస్పత్రులు అంగీకరించాయి.

News October 31, 2025

ఫైనల్లో వర్షం పడితే..?

image

ఆదివారం భారత్-సౌతాఫ్రికా మధ్య ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచుకు 63% వర్షం ముప్పు ఉందని IMD తెలిపింది. ఎల్లుండి మ్యాచ్ సాధ్యం కాకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం నిర్వహిస్తారు. ఆ రోజు కూడా వాన కారణంగా మ్యాచ్ జరగకపోతే గ్రూప్ స్టేజీలో టాప్‌లో నిలిచిన సౌతాఫ్రికానే విజేతగా ప్రకటిస్తారు. దీంతో వర్షం పడొద్దని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

News October 31, 2025

RSSను బ్యాన్ చేయాల్సిందే: ఖర్గే

image

దేశంలో లా అండ్ ఆర్డర్ సమస్యలను సృష్టిస్తున్నందుకు RSSను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, ఇందిరా గాంధీ 41వ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐరన్ మ్యాన్, ఐరన్ లేడీ ఇద్దరూ భారతదేశ ఐక్యత, సమగ్రత కోసం పని చేశారని చెప్పారు. దేశంలో చాలా సమస్యలకు BJP-RSSనే కారణమని ఆరోపించారు. 1948లో గాంధీ హత్య తర్వాత RSSను పటేల్ నిషేధించారని చెప్పారు.