News October 27, 2024
నవంబర్ 26న పార్లమెంటు ఉభయ సభల సమావేశం
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా Nov 26న పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశంకానున్నాయి. Nov 26, 1949న రాజ్యాంగాన్ని ఆమోదించిన పార్లమెంటు సెంట్రల్ హాల్లోనే లోక్సభ, రాజ్యసభ సభ్యులు భేటీ అవుతారు. గతంలో Nov 26న National Law Day నిర్వహించే వారు. అయితే, 2015లో అంబేడ్కర్125వ జయంతిని పురస్కరించుకొని ఆ రోజును Constitution Dayగా ప్రకటించారు.
Similar News
News October 27, 2024
‘దృశ్యం’లో వెంకటేశ్ చిన్నకూతురు.. ఇప్పుడెలా అయ్యారో చూడండి!
విక్టరీ వెంకటేశ్-మీనా నటించిన ‘దృశ్యం’ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అందులో వారి పెద్దకూతురిగా కృతిక, చిన్నకూతురిగా ఎస్తేర్ అనిల్ అద్భుతంగా నటించి ప్రశంసలు పొందారు. తాజాగా ఎస్తేర్ ఫొటోలు నెట్టింట వైరల్ కాగా ‘ఆ అమ్మాయి ఇప్పుడు ఇలా అయిందా?’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘దృశ్యం’లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లోనూ ఎస్తేరే నటించారు.
News October 27, 2024
Swiggy IPO: Nov 6-8 మధ్య పబ్లిక్ సబ్స్క్రిప్షన్
Swiggy IPO పబ్లిక్ సబ్స్క్రిప్షన్ నవంబర్ 6-8 తేదీల మధ్య జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. $11.3 బిలియన్ల (₹93,790 కోట్లు) IPO వాల్యుయేషన్ను సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. IPO ప్రైమరీ కాంపోనెంట్ను సుమారు ₹4,500 కోట్లకు పెంచారు. ఇన్వెస్టర్ల ఆసక్తికి అనుగుణంగా OFS కాంపోనెంట్నూ సవరించినట్లు తెలిసింది. మొత్తం IPO పరిమాణం ₹11,700 కోట్ల నుంచి ₹11,800 కోట్ల మధ్య ఉండవచ్చని పేర్కొన్నాయి.
News October 27, 2024
క్షీణిస్తున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగ్యం!
ఇజ్రాయెల్ ప్రతీకార దాడులను ఎదుర్కొంటున్న ఇరాన్ను సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ(85) ఆరోగ్య పరిస్థితి కలవరపెడుతోంది. ఖమేనీ తీవ్ర అనారోగ్యం బారిన పడినట్టు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు ఇజ్రహీం రైసీ మృతితో దేశంలో అస్థిరత ఏర్పడడంతో తాజాగా ఖమేనీ అనారోగ్యం ఇరాన్ను దిగులు పెడుతోంది. ఖమేనీ వారసుడిగా రెండో పెద్దకుమారుడు మొజ్తాబా పగ్గాలు చేపడతారని తెలుస్తోంది.