News November 29, 2024
అమిత్ షా నివాసంలో మహాయుతి నేతల భేటీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా ఇంట్లో మహాయుతి నేతలు దేవేంద్ర ఫడణవీస్, ఏక్నాథ్ శిండే, అజిత్ పవార్ సమావేశమయ్యారు. ఈ భేటీకి మరో కేంద్రమంత్రి జేపీ నడ్డా హాజరయ్యారు. దాదాపు అర్ధగంటకు పైగా సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ సీఎం అభ్యర్థి ఎవరనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశముంది.
Similar News
News November 15, 2025
‘శివ’ రీరిలీజ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.2.50కోట్లు

ఆర్జీవీ-నాగార్జున కాంబోలో తెరకెక్కిన ‘శివ’ మూవీ రీరిలీజ్లోనూ అదరగొట్టింది. నిన్న తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు మేకర్స్ తెలిపారు. అన్ని దేశాల్లోనూ ఈ కల్ట్ క్లాసిక్కు మంచి స్పందన వస్తోందని చెప్పారు. ఇదే జోరు కొనసాగితే రూ.10 కోట్ల వసూళ్లు చేయడం గ్యారంటీ అని అభిమానులు పేర్కొంటున్నారు. కాగా 1989లో విడుదలైన ఈ చిత్రం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
News November 15, 2025
KCRతో KTR భేటీ.. జిల్లాల పర్యటనలు చేయాలని ఆదేశం!

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత ఇవాళ కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ను కలిశారు. BRS ఓటమికి గల కారణాలను ఆయనకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రారంభానికి ముందు జిల్లాల పర్యటనకు సిద్ధం కావాలని KTRను కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ భవన్లో BRS ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు.
News November 15, 2025
రైలులో బైక్& కార్ పార్సిల్ చేయాలా?

రైలులో తక్కువ ధరకే వస్తువులను <


