News August 27, 2024
మెగా-అల్లు వివాదం.. మరోసారి స్పందించిన జనసేన ఎమ్మెల్యే

అల్లుఅర్జున్పై తాను చేసిన <<13952824>>వ్యాఖ్యలు<<>> పూర్తిగా వ్యక్తిగతం అని జనసేన MLA శ్రీనివాస్ తెలిపారు. ఒక మెగా అభిమానిగా మాత్రమే స్పందించానని అన్నారు. ‘నాకు ఇష్టమైతే నేను వస్తా. చిరంజీవి, నాగబాబు, పవన్కళ్యాణ్ను ఎవరైనా గౌరవం లేకుండా మాట్లాడితే స్పందిస్తా’ అని ట్వీట్ చేశారు. ‘హీరోలను YCP టార్గెట్ చేసిందన్న JSP నేతలే ఇప్పుడు AAను టార్గెట్ చేస్తున్నారు’ అని వస్తున్న విమర్శలపై MLA స్పందించారు.
Similar News
News December 12, 2025
వారికి ఇంటర్ ఎగ్జంప్షన్ పేపర్కు మార్కులు

AP: ఇంటర్ EXAMSలో దివ్యాంగులు ఎగ్జంప్షన్ పొందిన పేపర్కు ఇకపై సగటు MARKS ఇస్తారు. ఈమేరకు GO విడుదలైంది. వీరు 2 లాంగ్వేజ్ పేపర్లలో 1 రాస్తే చాలన్న రూలుంది. 5 పేపర్లలో 4కి MARKS వేసి మినహాయింపు పేపర్కు ‘E’ అని సర్టిఫికెట్లో పొందుపరుస్తున్నారు. అయితే ఈ సర్టిఫికెట్లపై IIT, NITలు అడ్మిషన్లు నిరాకరిస్తుండడంతో దివ్యాంగులు ఇబ్బంది పడగా గతేడాది లోకేశ్ జోక్యంతో సీట్లు దక్కాయి. ఇపుడన్నిటికీ MARKS ఇస్తారు.
News December 12, 2025
నటికి క్యాన్సర్.. పాపం ఎలా అయ్యారో చూడండి

టాలీవుడ్ సహాయ నటి వాహిని రొమ్ము క్యాన్సర్తో పోరాడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ట్రీట్మెంట్కి సుమారు ₹35లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. విషయం తెలిసిన నటి కరాటే కళ్యాణి SMలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆమె చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలని కోరారు. అటు వాహిని త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.
News December 12, 2025
ఘోరం.. బాలిక చెవి కొరుక్కుతిన్న కుక్క

AP: నంద్యాల జిల్లా ఆత్మకూరులో 4 ఏళ్ల చిన్నారిపై వీధికుక్క పాశవికంగా దాడి చేసింది. ఆసియా అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా దాడి చేసి చెవిని కొరుక్కుతింది. చెంపతో పాటు ఇతర శరీర భాగాలపైనా తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
* పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి


