News June 13, 2024

మెగా డీఎస్సీ: ఎందులో ఎన్ని పోస్టులంటే?

image

AP: సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ఈ డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ – 7,725, ఎస్జీటీ – 6,371, టీజీటీ – 1,781, పీజీటీ – 286, ప్రిన్సిపల్స్ – 52, పీఈటీ – 132 పోస్టులు ఉన్నాయి.
> SHARE

Similar News

News January 31, 2026

కూలీ నుంచి గ్రూప్-2 వరకూ.. ‘విజయ’లక్ష్మి స్ఫూర్తి ప్రయాణం

image

AP: కష్టాలకు ఎదురొడ్డి నిలబడి విజయాన్ని సొంతం చేసుకున్న మహిళ విజయలక్ష్మి. నంద్యాల(D) రుద్రవరం(M) యల్లావత్తుల గ్రామానికి చెందిన ఆమె పగలంతా కూలీ పనులు చేస్తూ, రాత్రి సమయంలో చదువు కొనసాగించారు. పేద కుటుంబ నేపథ్యంతో పాటు ట్రాక్టర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించే భర్త ప్రమాదానికి గురి కావడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. అయినా ఆమె కుంగిపోలేదు. పట్టుదలతో చదివి గ్రూప్-2లో ASOగా ఎంపికయ్యారు.

News January 31, 2026

నాకు ఇచ్చిన నోటీసు అక్రమం.. KCR లేఖ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ ACPకి కేసీఆర్ 6 పేజీల లేఖ రాశారు. ‘నాకు ఇచ్చిన నోటీసు అక్రమం. దాని ద్వారా నా గౌరవానికి భంగం కలిగించారు. ఇంటి గోడకు నోటీసు అంటించడం చట్టవిరుద్ధం. నేను కొన్ని సంవత్సరాలుగా ఎర్రవల్లిలో నివసిస్తున్నా. అక్కడే స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. చట్టపరమైన అభ్యంతరాలున్నా రేపు 3PMకు నందినగర్ నివాసంలో సిట్ విచారణకు హాజరవుతా’ అని లేఖలో పేర్కొన్నారు.

News January 31, 2026

రూ.5వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేశారు: జగన్

image

AP: విశాఖలో చంద్రబాబు, ఆయన కుటుంబం దాదాపు రూ.5వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేసుకుందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. రుషికొండ సమీపంలోని 54.79 ఎకరాల భూములను ఎంపీ భరత్‌కు కట్టబెట్టేశారని ట్వీట్ చేశారు. లోకేశ్‌కు ఎలాంటి అధికార పరిధి లేకపోయినా తోడల్లుడికి కేటాయించేలా చేశారని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు ఒత్తిళ్లతో GVMC సభ్యులను భయపెట్టి ఏకపక్షంగా ఆమోదించుకున్నారని పేర్కొన్నారు.