News June 13, 2024
మెగా డీఎస్సీ: ఎందులో ఎన్ని పోస్టులంటే?

AP: సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ఈ డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ – 7,725, ఎస్జీటీ – 6,371, టీజీటీ – 1,781, పీజీటీ – 286, ప్రిన్సిపల్స్ – 52, పీఈటీ – 132 పోస్టులు ఉన్నాయి.
> SHARE
Similar News
News December 26, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

*మత్స్యకారులకు 40% సబ్సిడీతో త్వరలో ఆటోలు అందిస్తామన్న మంత్రి DSBV స్వామి.. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో సబ్సిడీ వలలు పంపిణీ
*దివంగత కాపు ఉద్యమ నేత వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించారని ట్వీట్
*వరుస సెలవులతో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు ప్రయాణాలు.. విజయవాడ మార్గంలో ట్రాఫిక్ జామ్
News December 26, 2025
మరోసారి చెలరేగిన విరాట్ కోహ్లీ

విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ను చూపించారు. బెంగళూరు వేదికగా గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ తరఫున ఆడుతున్న కోహ్లీ 61 బంతుల్లో 77 పరుగులు (13 ఫోర్లు, 1 సిక్స్) చేసి ఔటయ్యారు. అంతకుముందు కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. గత 6 లిస్ట్-A మ్యాచ్ల్లో వరుసగా 74*, 135, 102, 65*, 131, 77 పరుగులతో విరాట్ అదరగొట్టారు.
News December 26, 2025
సూర్యవంశీకి ‘ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’

క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ(14)కి ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. వీర్ బాల్ దివస్ పేరిట ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ‘ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ అందుకున్నారు. చిన్న వయసులో కల్చర్, సోషల్ సర్వీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన వారికి ఈ పురస్కారం ఇస్తారు. ఈ ఏడాది 18 రాష్ట్రాల నుంచి 20 మంది పిల్లలు దీనికి ఎంపికయ్యారు.


