News August 10, 2025

ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోస్.. పిక్ వైరల్

image

మెగా హీరోలు రామ్‌చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ జిమ్‌లో చెమటోడ్చుతున్నారు. ఈ సందర్భంగా జిమ్ ట్రైనర్‌తో కలిసి వారు ఫొటోకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ మెగా హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడటం సంతోషంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కాగా ‘పెద్ది’తో చెర్రీ, ‘VT 15’తో వరుణ్, ‘SDT 18’తో సాయి ధరమ్ బిజీగా ఉన్నారు.

Similar News

News August 12, 2025

రేపటి నుంచి జాగ్రత్త

image

APలో రేపటి నుంచి 2 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రేపు ప.గో, ELR, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, OGL, ఎల్లుండి కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, OGL జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద ఉండవద్దని సూచించారు.

News August 12, 2025

మందుబాబులకు శుభవార్త

image

AP ప్రభుత్వం మందుబాబులకు తీపికబురు అందించింది. మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ఎక్సైజ్ రూల్-2024కు సవరణ చేసింది. పర్మిట్ రూమ్‌లు లేకపోవడం వల్ల బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ 2.77 లక్షల మంది పట్టుబడినట్లు పేర్కొంది. పొలాలు, పార్కులు, రోడ్ల పక్కన మద్యం సేవించడాన్ని తగ్గించేలా లైసెన్స్‌తో కూడిన పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు అనుమతించినట్లు వెల్లడించింది.

News August 12, 2025

‘వార్ 2’కు టికెట్ రేట్ల పెంపు.. ఎంతంటే

image

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’ మూవీకి టికెట్ రేట్లు పెంచుతూ AP ప్రభుత్వం జీవో జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లలో రూ.75, మల్టీప్లెక్సుల్లో రూ.100 చొప్పున పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఎల్లుండి రిలీజ్ రోజు ఉదయం 5 గంటలకు స్పెషల్ షోకు రూ.500 టికెట్ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. టికెట్ రేట్లు ఈనెల 23 వరకు కొనసాగనున్నాయి. మరోవైపు తెలంగాణలో మాత్రం ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు లేదు.