News March 23, 2024
మెగాస్టార్ ఆఫర్లు తిరస్కరించా: పృథ్వీరాజ్
‘సలార్’లో వరదరాజ మన్నార్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన పృథ్వీరాజ్ సుకుమారన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. HYD వచ్చిన ఆయన ఓ ప్రెస్మీట్లో పాల్గొన్నారు. సైరా నరసింహారెడ్డిలో నటించాలని, గాడ్ ఫాదర్కి దర్శకత్వం వహించాలని మెగాస్టార్ తనను కోరారని చెప్పారు. ఆ రెండుసార్లు తాను ‘ఆడుజీవితం’లో బిజీగా ఉండటంతో చిరంజీవికి క్షమాపణ చెప్పినట్లు వెల్లడించారు.
Similar News
News October 6, 2024
ప్రకటించిన అవార్డులను రద్దు చేయవచ్చా?
జాతీయ చలనచిత్ర అవార్డుల రద్దుకు నిర్దిష్ట నిబంధనలు లేకపోయినా అడ్మినిస్ట్రేటివ్ లా కింద రద్దు చేసే అధికారం అవార్డుల కమిటీకి ఉంటుంది. ఏ గుర్తింపుకైతే సదరు వ్యక్తికి అవార్డు ప్రకటించారో దానికి సంబంధించి కాపీ రైట్స్, క్రెడిట్స్ అవకతవకలు, ప్రలోభాలకు పాల్పడడం, నేరాభియోగాలపై అవార్డు రద్దు చేస్తారు. ఈ గ్రౌండ్స్పైనే జానీ మాస్టర్కు ప్రకటించిన అవార్డును తాత్కాలికంగా నిలిపివేశారు.
News October 6, 2024
రేపు వారి అకౌంట్లలో డబ్బులు జమ
AP: సాంకేతిక కారణాలతో పరిహారం అందని వరద బాధితులకు ప్రభుత్వం రేపు డబ్బులు అందించనుంది. మొత్తం 21,768 మంది ఖాతాల్లో రూ.18.69 కోట్లను జమచేయనున్నట్లు అధికారులు తెలిపారు. అందరికీ సాయం అందుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం గత నెలలో రూ.602 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. బ్యాంకు ఖాతాల్లో తప్పులు, ఆధార్ లింక్ కాకపోవడం వల్ల కొందరికి డబ్బులు జమకాలేదు.
News October 6, 2024
ఘోరం.. 1.7లక్షల మందికి ఒక్క టాయిలెట్!
బెంగళూరు అభివృద్ధిలో దూసుకెళ్తోంది. కానీ, అక్కడున్న 1.4 కోట్ల మంది ప్రజలకు కనీస మౌలిక సదుపాయమైన టాయిలెట్లను ఏర్పాటు చేయలేకపోయింది. నగరంలో 803 పబ్లిక్ టాయిలెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు RV యూనివర్సిటీ నివేదికలో వెల్లడైంది. ఈ లెక్కన ప్రతి 1.7లక్షల మందికి ఓ టాయిలెట్ ఉందన్న మాట. వీటిలోనూ సగం వాటిల్లో లైట్స్ లేవని తేలింది. కాగా HYDలోనూ టాయిలెట్స్ పెంచాలని నెటిజన్లు కోరుతున్నారు.