News November 2, 2024
కిషన్ రెడ్డికి ట్రీట్ ఇచ్చిన మెగాస్టార్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ట్రీట్ ఇచ్చారు. దీపావళి సందర్భంగా చిరు ఇంట్లో వీరిద్దరూ భేటీ అయ్యారు. చిరంజీవిని కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపినట్లు కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘మంచి మనిషి, మెగాస్టార్ చిరంజీవిని కలవడమంటే ఎప్పుడూ ఆనందమే. సామాజిక సేవతో పాటు ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించిన సేవలు ఎంతో మందికి ఆదర్శం’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Similar News
News February 13, 2026
ADB: IIT, NITలకు ప్రవేశ పరీక్ష

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో COE ప్రవేశాల కోసం ఈ నెల 14న ఉదయం 10 గంటలకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్ఎల్సీ కెప్టెన్ సలీముద్దీన్ తెలిపారు. చించొలిలోని RTO ఆఫీస్ వెనుక ఉన్న మైనారిటీ బాలుర విద్యాలయం ఈ పరీక్షా కేంద్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ విద్యతో పాటు IIT, NIT ప్రవేశ పరీక్షలకు ఉచిత ప్రత్యేక శిక్షణ అందిస్తామని ఆయన వెల్లడించారు.
News February 13, 2026
నెల్లూరు: రైతు మెడకు ఉరితాడు..!

అకాల వర్షాలు, కరవు, పెరిగిన సాగు ఖర్చులు, అధిక వడ్డీల భారం రైతు మెడకు ఉరితాడుగా మారుతున్నాయి. జిల్లాలో 2021(2), 2022(6), 2023(1), 2024(3), 2025(3) చొప్పున 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 8 మందికి రూ.7లక్షలు చొప్పున రూ.56 లక్షలు పరిహారం అందగా, 3 దరఖాస్తులు రిజెక్ట్ చేయగా, 3 ప్రతిపాదనలు పంపగా.. ఒకరిది అగ్రికల్చర్ లాగిన్లోకి రాలేదు. ప్రభుత్వాలు పంటకు మద్దతు ధర కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
News February 13, 2026
నెల్లూరు: రైతు మెడకు ఉరితాడు..!

అకాల వర్షాలు, కరవు, పెరిగిన సాగు ఖర్చులు, అధిక వడ్డీల భారం రైతు మెడకు ఉరితాడుగా మారుతున్నాయి. జిల్లాలో 2021(2), 2022(6), 2023(1), 2024(3), 2025(3) చొప్పున 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 8 మందికి రూ.7లక్షలు చొప్పున రూ.56 లక్షలు పరిహారం అందగా, 3 దరఖాస్తులు రిజెక్ట్ చేయగా, 3 ప్రతిపాదనలు పంపగా.. ఒకరిది అగ్రికల్చర్ లాగిన్లోకి రాలేదు. ప్రభుత్వాలు పంటకు మద్దతు ధర కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


