News November 2, 2024
కిషన్ రెడ్డికి ట్రీట్ ఇచ్చిన మెగాస్టార్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ట్రీట్ ఇచ్చారు. దీపావళి సందర్భంగా చిరు ఇంట్లో వీరిద్దరూ భేటీ అయ్యారు. చిరంజీవిని కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపినట్లు కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘మంచి మనిషి, మెగాస్టార్ చిరంజీవిని కలవడమంటే ఎప్పుడూ ఆనందమే. సామాజిక సేవతో పాటు ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించిన సేవలు ఎంతో మందికి ఆదర్శం’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Similar News
News December 1, 2025
హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం: CBN

AP: విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే పనిలో ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏలూరు(D) నల్లమాడులో పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన అక్కడి సభలో మాట్లాడారు. ‘94% స్ట్రైక్ రేట్తో గెలిపించారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News December 1, 2025
‘హిల్ట్’పై గవర్నర్కు BJP ఫిర్యాదు

TG: ‘హిల్ట్’ పేరిట ప్రభుత్వం భూదందాకు పాల్పడుతోందని BJP గవర్నర్కు ఫిర్యాదు చేసింది. 9,292.53 ఎకరాల భూమిని మల్టీపర్పస్కు వినియోగించేలా తక్కువ ధరకే అప్పగిస్తోందని, దీనివెనుక ₹5లక్షల CR స్కామ్ ఉందని ఆరోపించింది. వెంటనే జోక్యం చేసుకొని భూములను పరిరక్షించాలంది. ‘హిల్ట్’ను రద్దు చేసి రిటైర్డ్ జడ్జితో విచారించాలని పార్టీ చీఫ్ రామచందర్రావు, LP నేత మహేశ్వర్ రెడ్డి గవర్నర్కు అందించిన వినతిలో కోరారు.
News December 1, 2025
ధాన్యం కొనుగోళ్లు.. రూ.2,300 కోట్లు జమ చేేశాం: నాదెండ్ల

AP: రాష్ట్రంలో ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.2,300 కోట్ల నగదును రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ధాన్యం నిల్వలకు సంచుల కొరత లేకుండా చూస్తున్నామని, టార్పాలిన్లు ఉచితంగా రైతులకు అందిస్తున్నామని చెప్పారు.


