News July 27, 2024

ఒలింపిక్స్ టార్చ్ రెప్లికాతో మెగాస్టార్

image

పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్-2024 ప్రారంభ వేడుకల్లో హాజరైనందుకు సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి Xలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా భార్య సురేఖతో కలిసి ఒలింపిక్స్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకున్న ఫొటోను ఆయన పంచుకున్నారు. భారత బృందంలోని ప్రతి క్రీడాకారుడు అద్భుత ప్రదర్శన కనబరచాలని ఆయన వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘GO INDIA.. జై హింద్’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 24, 2025

భారత్‌కు మరో ఓటమి తప్పదా?

image

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఓడిన టీమ్ఇండియా రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్సులో 201 పరుగులకే ఆలౌటై సఫారీలకు 288 రన్స్ ఆధిక్యాన్ని కట్టబెట్టింది. అటు రేపు, ఎల్లుండి ఆట మిగిలి ఉండటంతో దూకుడుగా ఆడి <<18376327>>లీడ్<<>> పెంచుకోవాలని సఫారీ జట్టు చూస్తోంది. రెండో ఇన్నింగ్సులోనూ భారత ప్లేయర్లు ఇదే ప్రదర్శన చేస్తే 0-2తో సిరీస్‌ను చేజార్చుకునే ప్రమాదముంది. దీంతో WTCలో స్థానం దిగజారనుంది.

News November 24, 2025

లేటెస్ట్ అప్డేట్స్

image

* ధర్మేంద్ర మృతికి సంతాపం తెలియజేసిన చంద్రబాబు, రేవంత్, పవన్
* రాముడి పాదాల వద్ద ఎన్టీఆర్ పార్టీలో చేరా.. NTR చలవతోనే అవినీతిమయ రాజకీయాల్లోనూ రాణిస్తున్నా: మంత్రి తుమ్మల
* గ్రామపంచాయతీ రిజర్వేషన్లపై జీవో 46ను ఉపసంహరించుకోవాలన్న బీసీ సంఘాలు.. ప్రతి గ్రామంలో నిరాహార దీక్షలు చేయాలని తీర్మానం
* నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 331, నిఫ్టీ 108 పాయింట్లు దిగువకు

News November 24, 2025

ముంబైలో “పాతాళ్ లోక్” నెట్‌వర్క్‌

image

ముంబైని ‘ట్రాఫిక్ ఫ్రీ’ నగరంగా తీర్చిదిద్దేందుకు MH ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముంబైలో భారీ టన్నెల్‌ నెట్‌వర్క్‌ నిర్మిస్తామని CM దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. ఈ టన్నెల్‌ నెట్‌వర్క్‌ ఇప్పటికే ఉన్న రోడ్లతో ప్యారలల్‌గా ఉంటుందని తెలిపారు. ఈ సొరంగ మార్గాన్ని ఫేమస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘పాతాళ్ లోక్’తో ఫడణవీస్ పోల్చారు. ఈ నెట్ వర్క్‌తో ముంబై ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెప్పారు.