News August 20, 2024
ఎన్నికల బరిలో మెహబూబా ముఫ్తీ కుమార్తె

జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ వారసురాలిగా మెహబూబా ముఫ్తీ JK మొదటి మహిళా సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా ఆమె వారసురాలిగా ఇల్తిజా బెజ్బెహర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. PDP 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Similar News
News November 18, 2025
అగ్ర హీరోల నటగురువు కన్నుమూత

చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ కేఎస్ నారాయణస్వామి(92) కన్నుమూశారు. ఆయన మృతదేహానికి రజినీకాంత్ నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. సినీ వర్గాల్లో నారాయణస్వామి.. కేఎస్ గోపాలిగా సుపరిచితం. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నాజర్, రాధా రవి వంటి ప్రముఖులకు నటనలో ఆయన పాఠాలు చెప్పారు. రజినీని డైరెక్టర్ బాలచందర్కు పరిచయం చేసింది కూడా ఈయనే.
News November 18, 2025
అగ్ర హీరోల నటగురువు కన్నుమూత

చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ కేఎస్ నారాయణస్వామి(92) కన్నుమూశారు. ఆయన మృతదేహానికి రజినీకాంత్ నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. సినీ వర్గాల్లో నారాయణస్వామి.. కేఎస్ గోపాలిగా సుపరిచితం. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నాజర్, రాధా రవి వంటి ప్రముఖులకు నటనలో ఆయన పాఠాలు చెప్పారు. రజినీని డైరెక్టర్ బాలచందర్కు పరిచయం చేసింది కూడా ఈయనే.
News November 18, 2025
AIతో 20 శాతానికి పెరగనున్న నిరుద్యోగిత: ఆంత్రోపిక్ CEO డారియో

ఉద్యోగ మార్కెట్పై AI ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఆంత్రోపిక్ CEO డారియో అమోడీ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో సగం ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ జాబ్స్ కనుమరుగయ్యే ఛాన్స్ ఉందన్నారు. భవిష్యత్తులో అన్ఎంప్లాయిమెంట్ను 10 నుంచి 20 శాతానికి పెంచుతుందని అంచనా వేశారు. కన్సల్టింగ్, లా, ఫైనాన్స్ వంటి ప్రొఫెషన్స్కూ రిస్క్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ రంగాల్లో AI మోడల్స్ బాగా పనిచేస్తున్నాయని చెప్పారు.


