News October 17, 2024

పురుషులకూ బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు

image

బ్రెస్ట్ క్యాన్సర్ మహమ్మారి స్త్రీలకు మాత్రమే వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ పురుషుల్లోనూ వస్తుందని ఆంకాలజిస్ట్ డాక్టర్ సీఎన్ పాటిల్ తెలిపారు. ‘అరుదే అయినా వచ్చే ప్రమాదం లేకపోలేదు. హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, పర్యావరణం దీనికి కారణం కావొచ్చు. 60 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉన్న పురుషులకు రిస్క్ ఎక్కువ. ఛాతీలో గడ్డ కనిపిస్తే వెంటనే పరీక్షించుకోవడం ఉత్తమం’ అని వివరించారు.

Similar News

News October 18, 2024

ఈ నెల 21న దక్షిణ కొరియాకు మంత్రులు, ఎమ్మెల్యేలు

image

TG: మూసీ పునరుజ్జీవం కోసం అధ్యయనం చేసేందుకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, అధికారులు దక్షిణ కొరియాకు వెళ్లనున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు వారు సియోల్‌లో పర్యటిస్తారు. స్థానికంగా రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌పై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు.

News October 18, 2024

భారత్ టాస్ మాత్రమే గెలిచి అంతా ఓడింది: అజయ్ జడేజా

image

న్యూజిలాండ్‌తో టెస్టులో భారత్ ఆడిన విధానంపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా విమర్శలు గుప్పించారు. మ్యాచ్‌లో టాస్ గెలవడం ఒకటే భారత్ చేసిన మంచి పని అని తేల్చిచెప్పారు. ‘రెండో రోజు టాస్ తప్ప మిగిలిన ఆటంతా భారత్ ఓడింది. బౌలింగ్‌పరంగా ఫర్వాలేదనిపించారు కానీ బ్యాటింగ్ నిర్లక్ష్యంగా, ఫీల్డింగ్ నీరసంగా కనిపించింది. బ్యాటర్లు వికెట్లను చేజేతులా సమర్పించుకున్నారు’ అని విమర్శించారు.

News October 18, 2024

మా దేశానికి పీఎం మోదీ వచ్చి ఉంటే బాగుండేది: షరీఫ్

image

పాకిస్థాన్‌లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశానికి భారత PM మోదీ వచ్చి ఉంటే బాగుండేదని పాక్ మాజీ PM నవాజ్ షరీఫ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘వారి మంత్రి పర్యటనతోనైనా ఇరు దేశాల మధ్య సయోధ్య కుదురుతుందని ఆశిస్తున్నాం. మన మధ్య సమస్యల్ని కలిసి పరిష్కరించుకోవాలి. శాంతిచర్చలు కొనసాగాలి. 75 ఏళ్లు ఇలాగే వృథా అయ్యాయి. మరో 75 ఏళ్లు మనం వృథా చేయకూడదు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలుండాలి’ అని కోరారు.