News May 25, 2024
స్టార్ ఇండియాతో విలీనం.. సీసీఐ అనుమతి కోరిన రిలయన్స్

వయాకామ్ 18, స్టార్ ఇండియా వినోద ఛానళ్ల విలీనం గత కొంతకాలంగా ప్రతిపాదనల దశలో ఉంది. ఈ విలీనానికి సంబంధించి ఇండస్ట్రీస్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అనుమతిని వయాకామ్ 18 మాతృసంస్థ రిలయన్స్ తాజాగా కోరింది. ఈ విలీనం వలన దేశంలో పోటీ వ్యాపారాలపై ఎటువంటి ప్రభావం ఉండదని వివరించింది. ఈ డీల్ పూర్తయితే స్టార్, వయాకామ్కు చెందిన 100కు పైగా ఛానళ్లు, 2 ఓటీటీ సంస్థలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి.
Similar News
News December 4, 2025
భారీ జీతంతో ఉద్యోగాలు

తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ (<
News December 4, 2025
తల్లిపై కూతురు పోటీ.. విషాదాంతం

TG: రాజకీయాలు కుటుంబ సంబంధాలనూ విచ్ఛిన్నం చేస్తున్నాయి. నల్గొండ(D) ఏపూరులో తల్లీకూతురు మధ్య నెలకొన్న రాజకీయ వివాదం విషాదాంతమైంది. 3వ వార్డు అభ్యర్థులుగా తల్లి లక్ష్మమ్మను BRS, ఆమె కూతురు అశ్వినిని కాంగ్రెస్ బలపరిచింది. ఈ క్రమంలో కూతురు నామినేషన్ ఉపసంహరించుకున్నప్పటికీ ఫ్యామిలీ గొడవలు తారస్థాయికి చేరాయి. దీంతో లక్ష్మమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 4, 2025
సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్(73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని లోధి రోడ్డులో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీజేపీ తెలిపింది. సీనియర్ న్యాయవాది అయిన కౌశల్ గతంలో మిజోరం గవర్నర్గా పనిచేశారు. కాగా 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. సుష్మా-కౌశల్ దంపతులకు బన్సూరి స్వరాజ్ అనే కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా సేవలందిస్తున్నారు.


