News April 12, 2025
WhatsApp గ్రూపుల్లో మెసేజులు వెళ్లట్లేదు!

WhatsAppలో సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయి. గ్రూపుల్లో మెసేజులు సెండ్ అవ్వట్లేదు. దీంతో యూజర్లు, ముఖ్యంగా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై మెటా ఇంకా స్పందించలేదు. పర్సనల్ మెసేజులు మాత్రం ఏ సమస్య లేకుండా డెలివరీ అవుతున్నాయి. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా?
Similar News
News April 13, 2025
మటన్ను ఎంత తినాలి?

నాన్వెజ్ ప్రియులు మటన్ను ఇష్టంగా తింటారు. అయితే, అందులో కొవ్వులు ఎక్కువ ఉండటం వల్ల తగిన మోతాదులోనే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి వారానికి గ్రా.300, శారీరక శ్రమ చేసేవారు గ్రా.500 తినొచ్చని చెబుతున్నారు. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు గ్రా.100 మించి తినకూడదు. అలాగే, సరిగా ఉడకని మటన్ తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది. కొందరికి అజీర్తి ఏర్పడి విరేచనాలు అవుతాయి.
News April 13, 2025
ప్రపంచంలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ ఇవే

ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ గేమ్గా ఫుట్బాల్ నిలిచింది. 3.5 బిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో సాకర్ మొదటిస్థానంలో కొనసాగుతోంది. 2.5 బిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో క్రికెట్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హాకీ (2 బిలియన్), టెన్నిస్ (1 బిలియన్), వాలీబాల్ (900 మిలియన్) టాప్-5లో నిలిచాయి. టేబుల్ టెన్నిస్, బాస్కెట్ బాల్, బేస్ బాల్, రగ్బీ, గోల్ఫ్ టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.
News April 13, 2025
2026 ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదే: అన్నామలై

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో NDA అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేను అధికారం నుంచి దించడమే లక్ష్యంగా AIADMK, బీజేపీ కలిసి పని చేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల అమిత్ షా పర్యటన తర్వాత పార్టీ మరింత బలపడిందని చెప్పారు. తాను పార్టీ కోసం పని చేసే సాధారణ కార్యకర్తనని, తమ కొత్త అధ్యక్షుడిని బలోపేతం చేసే దిశగా పని చేస్తానని ఆయన వివరించారు.