News October 20, 2024
MH: MLA అభ్యర్థుల జాబితా విడుదల చేసిన BJP

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేేసే అభ్యర్థుల జాబితాను BJP విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా 99 మందితో ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసింది. ఆ పార్టీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్పూర్ సౌత్ వెస్ట్ నుంచి బరిలో నిలిచారు. కాగా నవంబర్ 20న పోలింగ్ జరగాల్సి ఉంది.
Similar News
News November 3, 2025
ఉపగ్రహాలతో గ్లోబల్ వార్మింగ్ను నియంత్రించొచ్చు: మస్క్

వాతావరణ మార్పులపై ఆందోళన పెరుగుతున్న వేళ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఏఐతో నడిచే భారీ ఉపగ్రహాల సముదాయంతో గ్లోబల్ వార్మింగ్ను నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. భూమిని చేరే సౌర శక్తి మొత్తంలో చిన్న సర్దుబాట్లు చేయడం ద్వారా వాతావరణాన్ని నియంత్రించవచ్చని మస్క్ ట్వీట్లో పేర్కొన్నారు. సహజ పరిణామాన్ని నిరోధిస్తే ముప్పు తప్పదని కొందరు ఆయనకు కౌంటర్ వేస్తున్నారు.
News November 3, 2025
కోయంబత్తూర్లో PG విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

కోయంబత్తూర్(TN) ఎయిర్ పోర్టు సమీపంలో PG విద్యార్థిని గ్యాంగ్ రేప్కి గురైంది. నిన్న సాయంత్రం ఆమె ప్రియుడితో కలిసి బయటకు వెళ్లింది. రాత్రి 11గ.లకు ఎయిర్పోర్టు దగ్గర కారులో వారు ఉండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి అద్దాలు పగులగొట్టారు. ప్రియుణ్ని తీవ్రంగా కొట్టారు. ఆమెను దూరంగా షెడ్లోకి లాక్కెళ్లి రేప్ చేశారు. పోలీసులు బాధితుల్ని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
News November 3, 2025
జూబ్లీహిల్స్కు పాక్కు లింక్ పెట్టడం సరికాదు: కిషన్ రెడ్డి

TG: రాజకీయ విమర్శలకు పరిమితులు ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్కు పాకిస్థాన్కు <<18176289>>లింక్<<>> పెట్టడం సరికాదన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఫ్రీ బస్సు ఒక్కటే. జూబ్లీహిల్స్లో BJPకి మంచి స్పందన వస్తోంది. అజహరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం BJPకే ప్లస్. KCR రెండేళ్లుగా ఎక్కడా కనిపించలేదు. ప్రజల మధ్యకు రాని ఆయన మళ్లీ CM ఎలా అవుతారు?’ అని మీడియాతో చిట్చాట్లో వ్యాఖ్యానించారు.


