News October 10, 2024
రతన్ టాటాకు ‘భారతరత్న’ ఇవ్వాలని MH ప్రభుత్వం తీర్మానం!

దివంగత రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. ఇవాళ నిర్వహించే క్యాబినెట్ భేటీలో ఈమేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించనుంది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది. దేశ పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడమే కాకుండా గొప్ప మానవతావాది అయిన రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనిపై మీ కామెంట్?
Similar News
News November 25, 2025
వేములవాడ ఆసుపత్రిలో ఉచిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో మంగళవారం ఉచిత కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరం జరిగింది. ఈ శిబిరంలో మొత్తంగా 31 మంది మగవారికి కోత, కుట్టులేని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. వేములవాడ, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాలకు చెందిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ శిబిరంలో డాక్టర్లు పెంచలయ్య, రమేష్, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
News November 25, 2025
పోలీసుల రూల్స్ కేవలం హిందువులకేనా?: రాజాసింగ్

TG: అయ్యప్ప మాల వేసుకున్న హైదరాబాద్ కంచన్బాగ్ ఎస్సైకి ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. పోలీసుల రూల్స్ కేవలం హిందువులకే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ముస్లిం సోదరులకు ఫ్రీడమ్ ఇచ్చి హిందూ పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. రంజాన్ సమయంలో ఇలాంటి రూల్స్ ఎందుకు పెట్టరని మండిపడ్డారు. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని సూచించారు.
News November 25, 2025
వాస్తు శాస్త్రం ప్రకారం.. పడక గది ఏ దిశలో ఉంటే మంచిది?

ఇంటి విస్తీర్ణంతో సంబంధం లేకుండా పెద్దవారి ప్రధాన పడక గది నైరుతి దిశలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పిల్లల గది వాయువ్య దిశలో ఉండటం మంచిదని చెబుతున్నారు. ‘ఈ దిశల అమరిక నిద్ర నాణ్యతను పెంచుతుంది. నిద్ర సుఖాన్ని మెరుగుపరుస్తుంది. నైరుతి స్థిరత్వాన్ని ఇవ్వగా, వాయువ్యం చైతన్యానికి మద్దతునిస్తుంది’ అని ఆయన వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


