News April 3, 2025

MHBD: అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్

image

రాజీవ్ యువవికాసం దరఖాస్తుదారులకు ఏ ఇబ్బందులూ లేకుండా అన్నిఏర్పాట్లు చేయాలని, వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్ఆర్ఆజీఎస్, పెన్షన్స్, యూనిఫామ్స్, సెర్ప్‌కు సంబంధించిన పనులు వేగవంతం చేయాలన్నారు.

Similar News

News January 9, 2026

వేములవాడ: భీమేశ్వరుడికి కోటిన్నర ఆదాయం

image

వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామి వారికి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించారు. గత 15 రోజులకు గాను హుండీ ద్వారా రూ.1,15,17,894 నగదు ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో రమాదేవి వెల్లడించారు. నగదుతో పాటు 32 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 100 గ్రాముల వెండిని భక్తులు మొక్కుబడిగా చెల్లించుకున్నారు. ఈవో పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో హుండీ లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారు.

News January 9, 2026

సిరిసిల్ల: ‘వృద్దుల డే కేర్ సెంటర్‌లో అన్ని వసతులు కల్పించాలి’

image

వృద్ధుల డే కేర్ సెంటర్‌లో అన్ని వసతులు కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారిని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్‌లో వృద్ధుల డే కేర్ సెంటర్‌ను త్వరలో ప్రారంభించనుండగా, ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శుక్రవారం పరిశీలించి త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వృద్ధులకు ఏర్పాటుచేసిన క్యారంబోర్డ్స్, చెస్ తదితర ఆట వస్తువులను పరిశీలించారు.

News January 9, 2026

పల్నాడు: కోడి పందేలపై కలెక్టర్ హెచ్చరిక

image

కోడి పందేలు నిర్వహిస్తే జంతు హింస నిరోధక చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కృతిక శుక్లా హెచ్చరించారు. కోడి పందేలు నివారణపై కలెక్టరేట్లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని ఎస్పీ కృష్ణారావుతో కలిసి నిర్వహించారు. పందేలు జరిగే అవకాశాలున్న ప్రాంతాలపై నిఘా పెట్టాలని, అన్ని గ్రామాల్లో దండోరా వేయించి హెచ్చరిక జారీ చేయాలని ఆదేశించారు. పందేలు నిర్వహిస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, బైండోవర్ చేయాలన్నారు.