News March 21, 2025

MHBD: ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలు వినియోగించుకోవాలి: డిపో మేనేజర్

image

ఆర్టీసీ కార్గో అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ శివప్రసాద్ అన్నారు. భద్రాచలంలో ఏప్రిల్ 6న శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుండగా కళ్యాణానికి వెళ్లలేని భక్తుల కొరకు స్వామివారి కల్యాణ తలంబ్రాలు టీజీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా బుక్ చేసుకుని పొందవచ్చని, డిపో మేనేజర్ శ్రీ ఎం శివ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.151 వెచ్చించి, బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News December 1, 2025

సూర్యాపేట: అత్యధిక ఓటర్లున్న గ్రామ పంచాయతీలు ఇవే

image

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల సంఖ్య ఆధారంగా టాప్-10 గ్రామాల జాబితా వెలువడింది. మేళ్లచెరువు గ్రామం 10,567 ఓట్లతో మొదటి స్థానంలో నిలిచి జిల్లాలోనే అతిపెద్ద గ్రామంగా రికార్డు సృష్టించింది. తర్వాతి స్థానాల్లో దొండపాడు (6,737), బేతవోలు (6,468), మఠంపల్లి (6,317), చిలుకూరు (6,041) ఉన్నాయి. మిగతా ఐదు గ్రామాల్లో తుంగతుర్తి, మునగాల, పొనుగోడు, రామాపురం, నూతనకల్ ఉన్నాయి.

News December 1, 2025

నేతివానిపల్లి సర్పంచ్‌ అభ్యర్థిగా తిరుపతమ్మ నామినేషన్

image

మల్దకల్ మండలం నేతువానిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి మహిళా నాయకురాలు తిరుపతమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, గ్రామ ప్రజలు ఏకతాటిపైకి వచ్చి సహకరించాలని కోరారు. అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కును అమ్ముకోకుండా నిజాయితీ గల వారికి ఓటు వేయాలన్నారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు తిమ్మప్ప, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

News December 1, 2025

ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

image

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>