News March 21, 2025
MHBD: ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలు వినియోగించుకోవాలి: డిపో మేనేజర్

ఆర్టీసీ కార్గో అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ శివప్రసాద్ అన్నారు. భద్రాచలంలో ఏప్రిల్ 6న శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుండగా కళ్యాణానికి వెళ్లలేని భక్తుల కొరకు స్వామివారి కల్యాణ తలంబ్రాలు టీజీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా బుక్ చేసుకుని పొందవచ్చని, డిపో మేనేజర్ శ్రీ ఎం శివ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.151 వెచ్చించి, బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News December 10, 2025
ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 10, 2025
రహదారుల అభివృద్ధికి రూ.87.25 కోట్లు: ఎంపీ బాలశౌరి

కృష్ణా జిల్లా గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం మొత్తం రూ. 87.25 కోట్ల ఎస్ఏఎస్సీఐ (SASCI) నిధులు మంజూరు చేసినందుకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం ఫేజ్-1 కింద రూ. 2,123 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ జీ.ఓ విడుదల చేసిందని ఎంపీ వివరించారు.
News December 10, 2025
NZB: ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుని వ్యక్తి మృతి

నిజామాబాద్లో ప్లాట్ ఫామ్.. రైల్ మధ్యలో ఇరుక్కొని వ్యక్తి మృతిచెందాడు. నిజామాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్ 3పై రైలు ఎక్కే క్రమంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. ప్లాట్ఫామ్, రైలు పట్టాల మధ్య ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలై స్పాట్లోనే మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. మృతుడి వయసు 40-45 ఏళ్లు ఉంటుందని, కుడిచేతి మధ్యవేలు లేదని గుర్తించారు. కేసు నమోదు చేశారు.


