News February 21, 2025
MHBD: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వెబ్సైట్!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్ తీసుకువచ్చింది. మహబూబాబాద్ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా.. లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. ప్రస్తుతం దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారంతా https:indirammaindlu.telangana.gov.inలో ఆధార్, ఫోన్ నంబర్ ద్వారా దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చు. Share It.
Similar News
News January 7, 2026
కామారెడ్డి: కస్తూర్బా విద్యాలయ స్పెషల్ ఆఫీసర్లకు శిక్షణ

కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయల స్పెషల్ ఆఫీసర్లకు, మోడల్ స్కూల్ హాస్టల్ కేర్ టేకర్లకు ఐదు రోజుల శిక్షణలో భాగంగా బుధవారం కామారెడ్డిలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ప్రారంభించారు. KGVP విద్యాలయాల్లో చదువుతున్న బాలికల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, హాస్టల్స్ నిర్వహణ గురించి శిక్షణలో చర్చించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు సుకన్య, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
News January 7, 2026
సూర్యాపేట: డీఎస్పీ నరసింహాచారికి పోలీస్ సేవా పతకం

సూర్యాపేట జిల్లా పోలీస్ సాయుధ విభాగంలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ నరసింహాచారిని రాష్ట్ర స్థాయి పోలీస్ సేవా పతకం వరించింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభ అవార్డుల్లో ఆయన చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు ఈరోజు ఎస్పీ నరసింహను డీఎస్పీ మర్యాదపూర్వకంగా కలిశారు. విధి నిర్వహణలో విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు డీఎస్పీని ఎస్పీ అభినందించి శుభాకాంక్షలు చెప్పారు.
News January 7, 2026
చంద్రబాబును కలిసిన ఎంపీ మాగుంట

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబును ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ వద్ద స్వాగతం పలికి పుష్పగుచ్ఛాన్ని అందించారు. కాగా ఢిల్లీలో ఉన్న మాగుంట ఈనెల 9న ఒంగోలుకు రానున్నారు. 9, 10న స్థానికంగా జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 10న ఒంగోలు పీవీఆర్ బాలుర మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతారు.


