News April 12, 2025
MHBD: ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గందరగోళం

ప్రభుత్వం పేదలకు ఇవ్వనున్న ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పలు గ్రామాల్లో గందరగోళం నెలకొంది. అధికార కాంగ్రెస్ నాయకులు కమిటీలుగా ఏర్పడి అర్హుల జాబితాను దాదాపు సిద్ధం చేశారు. కాగా, కొన్ని లిస్టులు లీక్ అవ్వగా అందులో తమ పేరు లేదని తెలుసుకున్న కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిటీ సభ్యులకు కావాల్సిన వారికి ఇళ్లు ఇవ్వాలని చూస్తున్నారని వాట్సప్ వేదికగా ఆరోపిస్తున్నారు.
Similar News
News October 17, 2025
తడిలో చేతిపై ముడతలు.. ఇందుకేనట!

నీటిలో కొద్దిసేపు ఉండగానే చేతులు, పాదాలపై ముడతలు ఏర్పడటం చూస్తుంటాం. ఈ ప్రక్రియను ఓస్మోటిక్ వ్యాప్తి అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. నీటిలో ఉన్న వస్తువులను పట్టుకోవడానికి ఇవి సహాయపడతాయని చెబుతున్నారు. ‘శరీరంలోని అటానమిక్ నెర్వస్ సిస్టమ్ రక్త నాళాలను సంకోచింపజేయడం ద్వారా ముడతలు ఏర్పరుస్తుంది. ఆదిమానవులు తడి వాతావరణంలో ఆహారం సేకరించేందుకు ఇవి ఉపయోగపడేవి’ అని అభిప్రాయపడ్డారు.
News October 17, 2025
ధర్మవరం పోలీసుల అదుపులో ఉగ్రవాద సానుభూతిపరులు?

ధర్మవరంలో ఇటీవల అరెస్టయిన ఉగ్రవాద సానుభూతిపరుడు నూర్ మహ్మద్ ఇచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన తౌఫిక్ షేక్ అస్లాం, ఉత్తరప్రదేశ్కు చెందిన సజ్జద్ హుస్సేన్ల అరెస్ట్ చేసినట్లు తెలిసింది. నేడు వారిని అరెస్ట్ చూపి రిమాండ్కు తరలించే అవకాశం ఉంది.
News October 17, 2025
కర్నూలు మోదీ సభ హైలైట్స్

★ చంద్రబాబు నాయకత్వంలో సరికొత్త శక్తిగా ఏపీ: పీఎం మోదీ
★ మోదీ సంస్కరణలు గేమ్ చేంజర్లు: సీఎం
★ మోదీ ఓ కర్మయోగి.. మరో 15ఏళ్లు కూటమి పాలన: డిప్యూటీ సీఎం
★ ప్రధాని కోరినవన్నీ ఇస్తున్నారు: లోకేశ్
★ అఖండ భారతావని బాగుండాలని శ్రీశైలంలో మోదీ పూజలు
★ లోకేశ్కు ప్రధాని కితాబు.. సరదా ముచ్చట
★ ₹13,429 కోట్ల పనులకు శ్రీకారం
★ టైం అంటే టైం.. షెడ్యూల్ ప్రకారమే సాగిన పర్యటన
★ సభలో 2 లక్షల మంది పాల్గొన్నారని అంచనా