News March 11, 2025
MHBD: ఈనెల 14 నుంచి వ్యవసాయ మార్కెట్ బంద్

మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్కు ఈనెల 14 నుంచి 16 వరకు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ సుధాకర్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్లో మిర్చి పంట పోటెత్తినట్లు తెలిపారు. సుమారు 20 వేల బస్తాలు మార్కెట్లో ఉన్నాయని, రైతులు మిర్చి పంటను విక్రయానికి తీసుకురావొద్దని సూచించారు. ఈనెల 17 నుంచి మార్కెట్లో కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News March 21, 2025
పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఆదిలాబాద్ కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట శిక్షణ కలెక్టర్ అభిగ్యాన్, డీఈఓ ప్రణీత తదితరులు ఉన్నారు.
News March 21, 2025
పులివెందుల: మేమేం పాపం చేశాం.!

పులివెందుల పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం ఎర్రటి ఎండలో ఓ మహిళ చంటి బిడ్డను ఎత్తుకొని బిక్షాటన చేస్తున్న ఘటన కనిపించింది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డతో ఏ మహిళ ఇలాంటి పని చేయదు. ఆ పసిబిడ్డ నిజంగా కన్నబిడ్డనా లేక ఆ పసిబిడ్డను కూడా డబ్బు దందాకు వాడుకుంటున్నారా అని పలువురు సందేహిస్తున్నారు. వీధి బాలలను సంరక్షించాల్సిన అధికారులకు ఇలాంటివి కనపడవా అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు.
News March 21, 2025
కామారెడ్డి: 10 పరీక్షలు తొలి రోజు గైర్హాజరు ఎంతంటే..?

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్ష ఉదయం 9:30 నుంచి 12.30 గంటల వరకు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 12,579 మంది విద్యార్థులకు 12,552 మంది హాజరు కాగా, 27 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు. పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు ఫ్లయింగ్ స్కాడ్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.