News January 23, 2025

MHBD: ఈనెల24 నుంచి ప్రారంభం కానున్న మిర్చి కొనుగోలు 

image

ఈనెల 24 నుంచి మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోలు చేస్తారని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. రైతులు ఎవరూ మధ్య దళారులను నమ్మి మిర్చిని తక్కువ రేటుకు అమ్ముకోవద్దని సూచించారు. రైతులు మిర్చిని మహబూబాబాద్ మార్కెట్‌కు తీసుకురావాలని కోరారు.

Similar News

News November 21, 2025

1956లో ప్రస్థానం ప్రారంభం.. నేటికి JNTUకి 60 ఏళ్లు

image

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలకు ముస్తాబైంది. 1965లో నాగార్జున ఇంజినీరింగ్ కళాశాలగా ఆవిర్భవించి 1972లో జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌గా అవతరించింది. 2015లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకొని నేడు డైమండ్ జూబ్లీ వేడుకలకు యూనివర్సిటీ కళాశాల సిద్ధమైంది. ఈ 60 ఏళ్లలో ఎన్నో ఘనతలు సాధించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చింది.

News November 21, 2025

నల్గొండ: లంచగొండి అధికారులు.. 11 నెలల్లో 15 కేసులు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో అవినీతికి పాల్పడుతున్న లంచగొండి ప్రభుత్వ అధికారులను ఏసీబీ వలపన్ని పట్టుకుంటూ దడ పుట్టిస్తోంది. నెలనెల లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా కొందరు అధికారులు అత్యాశకు పోయి, ప్రతీ పనికి ధర నిర్ణయించి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది 11 నెలల్లోనే ఉమ్మడి జిల్లాలో సుమారు 15 ఏసీబీ కేసులు నమోదవడం గమనార్హం.

News November 21, 2025

మిస్‌ యూనివర్స్‌-2025 ఫాతిమా బాష్‌ గురించి తెలుసా?

image

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్-2025 పోటీల్లో “ఫాతిమా బాష్” విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు. మెక్సికోలోని శాంటియాగో డి తెపా ప్రాంతానికి చెందిన ఫాతిమా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేశారు. స్కూల్‌లో చదువుతున్నప్పుడు డిస్లెక్సియా, హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌తో బాధపడిన ఆమె వాటిని దాటుకొని అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా 121 దేశాల అందగత్తెలను దాటి మిస్ యూనివర్స్‌గా నిలిచారు.