News April 3, 2025

MHBD: ఓపెన్ పరీక్షలపై అదనపు కలెక్టర్ సమీక్ష

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. పట్టణంలో ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, మంచినీటి సౌకర్యం విద్యార్థులకు అందుబాటులో ఉంచి ఆర్టీసీ బస్సుల ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో చేపట్టాలన్నారు.

Similar News

News December 2, 2025

WNP: రేపటి నుంచి మూడో దశ పంచాయతీ నామినేషన్లు

image

మూడో దశ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈనెల 3 నుంచి ప్రారంభం కానుంది. వనపర్తి జిల్లాలోని చిన్నంబావి, వీపనగండ్ల, పానగల్, శ్రీరంగాపూర్, పెబ్బేరు మండలాల్లో మొత్తం 87 పంచాయతీలలో 806 వార్డులకు నామినేషన్ల అభ్యర్థులు వేరు ఉన్నారు. అధికారులు ఐదు మండలాలలో 34 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే మండలాల్లో కొన్ని గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక జోరుగా కొనసాగుతుంది.

News December 2, 2025

‘మెగా పీటీఎం 3.O‌కు రూ.9.84 కోట్లు కేటాయింపు’

image

ఈనెల 5న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జరగనున్న మెగా పేరెంట్ టీచర్ డే (పి.టి.ఎం 3.0) కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.9.84 కోట్లు కేటాయించింది. రాష్ట వ్యాప్తంగా 45,190 సర్కారు పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరగనుందని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా పార్వతీపురం(D) భామిని ఏపీ మోడల్ స్కూల్లోని కార్యక్రమానికి సీఎం చంద్రబాబు పాల్గొంటారన్నారు.

News December 2, 2025

దిత్వా విధ్వంసం.. 465 మంది మృతి

image

దిత్వా తుఫాన్‌ శ్రీలంకలో పెను విషాదాన్ని మిగిల్చింది. కుండపోత వర్షాలు, వరదల బీభత్సం, కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 465 మంది చనిపోయినట్లు లంక ప్రభుత్వం తెలిపింది. మరో 366 మంది గల్లంతయినట్లు పేర్కొంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. IND సహా పలు దేశాలు లంకకు మానవతా సాయం అందించిన విషయం తెలిసిందే. అటు దిత్వా ఎఫెక్ట్ తమిళనాడుపైనా తీవ్రంగా పడింది. APలో భారీ వర్షాలు కురిశాయి.