News January 31, 2025
MHBD: కూతురి పెళ్లి కోసం దాచుకున్న నగదు చోరీ

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం శివారు బేగావతు తండాలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వీరన్న ఇంట్లో కూతురి పెళ్లి కోసం దాచుకున్న రూ.9 లక్షల నగదు దోచుకుపోయారని బాధితులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సీరోలు ఎస్సై సీహెచ్ నగేశ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Similar News
News February 28, 2025
వరంగల్: మీ మండలంలో ఎంత పోలింగ్ అయిందంటే..?

వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జిల్లాలో 94.13శాతం పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి. వర్ధన్నపేట-97.83, రాయపర్తి-90.91, నెక్కొండ-97.18, ఖానాపురం-94.52, నర్సంపేట- 94.91, చెన్నారావుపేట-94.92, పర్వతగిరి-97.44, సంగెం-98.48, నల్లబెల్లి-95.24, దుగ్గొండి-91.67, గీసుకొండ-94.44, వరంగల్-93.07, ఖిల్లా వరంగల్-93.99
News February 28, 2025
ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు : WGL కలెక్టర్

ఖమ్మం వరంగల్ నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఓటు హక్కు కలిగిన ఉపాధ్యాయులు ఉదయం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 2,352 మంది ఓటర్లకు 94.13 శాతం ఓటేశారని పేర్కొన్నారు. ప్రత్యేక వాహనాల ద్వారా బ్యాలెట్ పత్రాలను భారీ బందోబస్తు మధ్య నల్గొండ జిల్లాకు తరలించారని తెలిపారు.
News February 27, 2025
వరంగల్: ముగిసిన పోలింగ్.. 94 శాతం పోలింగ్

ఉమ్మడి వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. వరంగల్ జిల్లాలో మొత్తం 2352 ఓట్లకు 2214మంది ఉపాధ్యాయులు ఓటేశారు. మొత్తంగా 94.13 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.