News March 14, 2025
MHBD: కొడుకుతో ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ

మహబూబాబాద్ జిల్లా ఇస్లావత్ తండాకు చెందిన భూక్యా శ్రీలతకు ఆమె భర్త మోతిలాల్కు మార్చి 4వ తేదీన వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి ఇంటి నుంచి తన కొడుకు వినయ్ని తీసుకొని శ్రీలత బయటకు వెళ్ళిపోయింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఇళ్లు, ఇతర చోట్ల వెతికారు. కాని ఆచూకీ లేకపోవడంతో తల్లి ఇస్లావత్ కాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కురవి SI సతీష్ తెలిపారు.
Similar News
News March 21, 2025
ఎంఎస్ ధోనీ అన్ని సీజన్ల స్కోర్లు ఇవే

భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ IPL తొలి సీజన్ నుంచి ఆడుతున్నారు. ఇప్పటికీ తన ఆటతీరుతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 43 ఏళ్ల వయసులో IPL 2025లో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ధోనీ అన్ని సీజన్ల స్కోర్లు ఇలా ఉన్నాయి. 2008-414, 2009-332, 2010-287, 2011-392, 2012-358, 2013-461, 2014-371, 2015-372, 2016-284, 2017-290, 2018-455, 2019-416, 2020-200, 2021-114, 2022-232, 2023-104, 2024లో 161 రన్స్ చేశారు.
News March 21, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

✔GET READY.. రేపే టెన్త్ పరీక్షలు✔టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి:MEOలు✔తాగునీటి తలెత్తకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్లు✔ముగిసిన ఇంటర్ పరీక్షలు✔NGKL:SLBC టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరం✔MBNR:కేంద్ర మంత్రిని కలిసిన MP,MLA✔సీఎం రేవంత్ రెడ్డి విప్లవ నాయకుడు: మల్లు రవి✔పాలెంలో అంబులెన్స్ దగ్ధం✔NGKL: ఘనంగా బంజారాల హోలీ సంబరాలు
News March 21, 2025
బిల్లులు ఆమోదం.. నాగర్ కర్నూల్ ఎంపీ హర్షం

తెలంగాణ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించబడింది. ఈ చారిత్రక నిర్ణయాన్ని పురస్కరించుకొని, ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఎంపీ డాక్టర్ మల్లు రవి సహచర ఎంపీలతో కలిసి బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి సంబరాలు నిర్వహించారు. రాహుల్ గాంధీ ఎన్నికల హామీ నెరవేరిందని, సామాజిక న్యాయ సాధనంలో ఇది కీలక ముందడుగని అన్నారు.