News March 12, 2025

MHBD: గాంధీ సిద్ధాంతాల బ్రోచర్ ఆవిష్కరణ

image

మహబూబాబాద్ విద్యాశాఖ కార్యాలయంలో గాంధీ సిద్ధాంతాల కరపత్రాలు, బ్రోచర్లను జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. 1930 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రం సబర్మతి ఆశ్రమం నుంచి మార్చి 12న మొదలై దండి వరకు 24 రోజుల పాటు జరిగిన ఉప్పు సత్యాగ్రహ మార్చ్ దేశ చరిత్రలో కీలక ఘట్టంగా పేర్కొంటారని తెలిపారు. నెల రోజులు జిల్లా వ్యాప్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

Similar News

News November 22, 2025

సిరిసిల్ల: TG డయాగ్నోస్టిక్ సెంటర్‌ను తనిఖీ చేసిన DMHO

image

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్, తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రక్త నమూనాలను, రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. వ్యాధులను అరికట్టడంలో జిల్లాను అగ్రస్థానంలో ఉంచాలని సిబ్బందికి సూచించారు. వ్యాధి నిరోధక టీకాలపై చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.

News November 22, 2025

సంగారెడ్డి: పోలీసులకు ఫిట్నెస్ కీలకం: ఎస్పీ

image

పోలీసులకు ఫిట్నెస్ కీలకమని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో వీక్లీ పరేడ్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల ఆరోగ్యం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

News November 22, 2025

మహిళలకు ₹లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు: భట్టి

image

TG: మహిళలకు ఏటా వడ్డీలేని రుణాల కింద ₹20వేల కోట్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని Dy CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటి వరకు ₹27వేల CR అందించామని, 5 ఏళ్లలో ₹లక్ష CR ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.15 CR కుటుంబాలుంటే అందులో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి పథకాలతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు.