News March 12, 2025

MHBD: గాంధీ సిద్ధాంతాల బ్రోచర్ ఆవిష్కరణ

image

మహబూబాబాద్ విద్యాశాఖ కార్యాలయంలో గాంధీ సిద్ధాంతాల కరపత్రాలు, బ్రోచర్లను జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. 1930 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రం సబర్మతి ఆశ్రమం నుంచి మార్చి 12న మొదలై దండి వరకు 24 రోజుల పాటు జరిగిన ఉప్పు సత్యాగ్రహ మార్చ్ దేశ చరిత్రలో కీలక ఘట్టంగా పేర్కొంటారని తెలిపారు. నెల రోజులు జిల్లా వ్యాప్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

Similar News

News March 14, 2025

నల్గొండ: ఈనెల 17, 18 తేదీల్లో కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల వంటా వార్పు

image

రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 17, 18 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట వంట వార్పు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సిఐటీయూ జిల్లా నాయకులు అవుటు రవీందర్ తెలిపారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమస్యలతో కూడుకున్న మెమోరాండం నల్గొండ జిల్లా కార్యాలయంలో సమర్పించారు.

News March 14, 2025

 టెన్త్ ఎగ్జామ్స్‌..ఎలా చదువుతున్నారు: కలెక్టర్

image

పదవ తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయని, కష్టపడి చదువుకుంటే మంచి మార్కులు వస్తాయని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కొండాపూర్ కస్తూర్బా పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులు ఎలా చదువుతున్నారు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చదివించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మండల విద్యాధికారి దశరథ్ పాల్గొన్నారు.

News March 14, 2025

వర్గల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

image

వర్గల్ మండలం గౌరారం రాజీవ్ రహదారిపై ఈనెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో గౌరారంలో నివాసం ఉంటున్న దుర్గాప్రసాద్ (28) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆర్వీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడు దుర్గాప్రసాద్‌కు భార్య, రెండు సంవత్సరాల కూతురు, రెండు నెలల బాబు ఉన్నారు.

error: Content is protected !!