News March 10, 2025

MHBD: గొంతులో పల్లీ ఇరుక్కుని బాలుడి మృతి.. UPDATE

image

గొంతులో పల్లీ ఇరుక్కుని MHBD జిల్లా గూడురు మండలంలో <<15703711>>బాలుడు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. నాయకపల్లికి చెందిన వీరన్న, కల్పనలకు ఇద్దరు కూతుళ్ల తర్వాత 3వ సంతానం కొడుకు అక్షయ్(18 నెలలు). ఈనెల 7న బాలుడు పల్లి గింజను మింగాడు. దగ్గడం గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లు డాక్టర్లు గుర్తించారు. MGMలో చికిత్స పొందుతూ శ్వాస ఆడక ఆదివారం మృతి చెందాడు.

Similar News

News December 5, 2025

HYD: పునర్విభజనపై అభిప్రాయానికి సిద్ధమా?

image

గ్రేటర్‌లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు విలీనం చేయడంతో ఇపుడు అధికారులు వార్డుల పునర్విభజనపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయాలను సేకరించనున్నారు. 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోనున్నారు. ఇందుకు వారం గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాత పది రోజుల్లోపు డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిచేస్తారు. అప్పుడే అసలు ఎన్ని వార్డులు వచ్చే అవకాశముందనే విషయంపై క్లారిటీ వస్తుంది.

News December 5, 2025

Breaking: వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ

image

RBI గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.50 నుంచి 5.25 శాతానికి చేరింది. ఈ క్రమంలో లోన్లు తీసుకునే వారికి ఊరట దక్కనుంది. ద్రవ్య విధాన కమిటీ 3 రోజుల సమావేశం తర్వాత ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. కాగా ఫిబ్రవరి, ఏప్రిల్‌లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున, జూన్‌లో 50 పాయింట్లను ఆర్బీఐ తగ్గించింది.

News December 5, 2025

ఎన్నికల కోడ్.. కామారెడ్డిలో మద్యం విక్రయాలపై ఆంక్షలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు మూడు విడతలలో ఆయా మండలాల్లోని కల్లు దుకాణాలు, మద్యం డిపోలు, వైన్ షాపులు, బార్లను మూసివేయాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళిని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.