News March 10, 2025

MHBD: గొంతులో పల్లీ ఇరుక్కుని బాలుడి మృతి.. UPDATE

image

గొంతులో పల్లీ ఇరుక్కుని MHBD జిల్లా గూడురు మండలంలో <<15703711>>బాలుడు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. నాయకపల్లికి చెందిన వీరన్న, కల్పనలకు ఇద్దరు కూతుళ్ల తర్వాత 3వ సంతానం కొడుకు అక్షయ్(18 నెలలు). ఈనెల 7న బాలుడు పల్లి గింజను మింగాడు. దగ్గడం గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లు డాక్టర్లు గుర్తించారు. MGMలో చికిత్స పొందుతూ శ్వాస ఆడక ఆదివారం మృతి చెందాడు.

Similar News

News April 17, 2026

5 మ్యాచుల్లో 0 వికెట్లు.. బుమ్రా పేలవ ప్రదర్శన

image

MI స్టార్ బౌలర్ బుమ్రా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తన పదునైన బౌలింగ్‌తో T20 WC గెలుపులో కీలక పాత్ర పోషించిన ఈ యార్కర్ల కింగ్ IPLలో మాత్రం తేలిపోతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన 5 మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. పైగా పరుగులు భారీగా సమర్పించుకుంటున్నారు. నిన్నటి మ్యాచ్‌లో ముంబై 195 పరుగులు చేసినా ఓడిపోయింది. పరోక్షంగా ఇందుకు బుమ్రా కూడా కారణం. 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చారు.

News April 17, 2026

5 మ్యాచుల్లో 0 వికెట్లు.. బుమ్రా పేలవ ప్రదర్శన

image

MI స్టార్ బౌలర్ బుమ్రా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తన పదునైన బౌలింగ్‌తో T20 WC గెలుపులో కీలక పాత్ర పోషించిన ఈ యార్కర్ల కింగ్ IPLలో మాత్రం తేలిపోతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన 5 మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. పైగా పరుగులు భారీగా సమర్పించుకుంటున్నారు. నిన్నటి మ్యాచ్‌లో ముంబై 195 పరుగులు చేసినా ఓడిపోయింది. పరోక్షంగా ఇందుకు బుమ్రా కూడా కారణం. 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చారు.

News April 17, 2026

మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన కేంద్రం

image

చట్టసభల్లో మహిళలకు 33% కోటాను కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టం నిన్నటి నుంచే అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 16ను చట్టం అమలు తేదీగా ప్రకటిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2029లో అమలు చేసేందుకు సంబంధించి ఇదే చట్టాన్ని సవరించాలని పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలోనే నోటిఫై చేయడం గమనార్హం. సాంకేతిక కారణాల వల్లే ఇలా చేసినట్లు ఓ అధికారి చెప్పారు. ఇదో విచిత్రమైన చర్య అని కాంగ్రెస్ మండిపడింది.