News April 16, 2025
MHBD: చిన్నారిపై కత్తితో కాల్చి వాతపెట్టిన అంగన్వాడి ఆయా

మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీలోని అంగన్ వాడీ కేంద్రంలో విద్యనభ్యసిస్తున్న మణిదీప్(5)పై అంగన్వాడి ఆయా కత్తితో కాల్చి వాత పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయా దాష్టికంపై సీడీపీవోకు చిన్నారి తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే ఘటన జరిగి 4 రోజులు అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో అంగన్వాడీ సెంటర్ ముందు బాధితుడి బంధుమిత్రులు ఆందోళనకు దిగారు.
Similar News
News November 20, 2025
చట్టప్రకారమే KTRపై చర్యలు: మహేశ్ గౌడ్

TG: ఫార్ములా ఈ-కార్ రేస్లో KTR తప్పు చేశారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ‘BRS హయాంలో జరిగిన ప్రజాధన దోపిడీని సరిచేస్తుందనే కాంగ్రెస్కు అధికారమిచ్చారు. అందుకే అన్నింటిపై కమిషన్లు వేశాం. రూల్స్ అతిక్రమించి KTR ప్రభుత్వ సొమ్మును ప్రైవేటు వ్యక్తికి పంపారని కమిషన్ రిపోర్టులో ఉంది. అప్పటి మంత్రిగా ఆయన తప్పు ఒప్పుకోవాలి. గవర్నర్ అనుమతించారు కాబట్టి చట్టం తనపని తాను చేస్తుంది’ అని తెలిపారు.
News November 20, 2025
పెళ్లికి ముందు రక్తపరీక్షలు ఎందుకంటే?

ఆరోగ్యకరమైన వైవాహిక జీవితం కోసం, పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసం పెళ్లికి ముందే జంటలు కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాలంటున్నారు నిపుణులు. తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హెచ్ఐవీ, హెపటైటిస్ B, C, సిఫిలిస్ వంటి ఇన్ఫెక్షన్లు, Rh ఫ్యాక్టర్ను గుర్తించడానికి రక్త పరీక్షలు కీలకం. భవిష్యత్తును ఆరోగ్యకరంగా, సంతోషంగా ప్లాన్ చేసుకోవడానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని ప్రతిఒక్కరూ గుర్తించాలి.
News November 20, 2025
వరంగల్: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ

డ్రగ్స్ రహిత సమాజమే మనందరి ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాలు వినియోగించే వారితో పాటు, వాటిని విక్రయాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, దీనిపై అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని సీపీ సూచించారు.


