News March 11, 2025

MHBD: జాబ్ మేళా సద్వినియోగపర్చుకోండి: రజిత

image

MHBD జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 12న వైఎస్‌కే ఇన్ఫోటెక్ రంగారెడ్డి, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగపరచుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి టి రజిత ఒక ప్రకటనలో తెలిపారు. 18-28 ఏళ్లు నిండి ఉండి పదవ తరగతి విద్యార్హతతో ఆసక్తి కలిగిన స్త్రీలు దరఖాస్తు చేసుకోవాలని రజిత పేర్కొన్నారు. 

Similar News

News September 19, 2025

MDK: కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు

image

ప్రభుత్వం భారీ వ్యయంతో నిర్మించ తలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై హరీశ్‌ రావు విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.84 వేల కోట్లు అయితే కేవలం తమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు చేపట్టే ప్రాణహిత-చేవెళ్లకు రూ.35 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. రూ.35వేల కోట్లు ఖర్చు చేసి కేవలం 4.47లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం, అమోఘమని ఎద్దేవా చేశారు.

News September 19, 2025

ఏపీలో గోల్డ్ మైన్.. త్వరలో పసిడి ఉత్పత్తి!

image

AP: కర్నూల్(D) జొన్నగిరి వద్ద తాము అభివృద్ధి చేస్తున్న గనిలో త్వరలో పసిడి ఉత్పత్తిని ప్రారంభిస్తామని దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ MD హనుమప్రసాద్ వెల్లడించారు. పర్యావరణ అనుమతులు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వగానే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామన్నారు. ఇదే జరిగితే దేశంలో గనుల నుంచి బంగారాన్ని తీసే తొలి ప్రైవేట్ కంపెనీగా DGML నిలవనుంది. ఏటా 750-1000kgs గోల్డ్ ఉత్పత్తి అవుతుందని అంచనా.

News September 19, 2025

దేశంలోనే ముల్కనూర్ సహకార సొసైటీ నంబర్ 1

image

HNK జిల్లా భీమదేవరపల్లి(M) ముల్కనూర్ సహకార సొసైటీ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. ఇది ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద సోసైటీగా గుర్తింపు పొందింది. 1956లో అలిగిరెడ్డి విశ్వనాథ్ రెడ్డి 373 మంది రైతులతో రూ.2,300 మూలధనంతో ప్రారంభించారు. ఈ సొసైటీ ప్రస్తుతం 7,540 మంది రైతులతో రూ.400 కోట్లతో విజయవంతంగా నడుస్తోంది. ప్రస్తుతం ముల్కనూర్ సహకార పరపతి సంఘం 69వ వార్షిక మహాసభ వేడుకలు జరుగుతున్నాయి.