News March 4, 2025
MHBD: జిరాక్స్ సెంటర్లు మూసేయండి: కలెక్టర్

మహబూబాబాద్ జిల్లాలోని కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలు దగ్గర్లో ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News October 17, 2025
వైట్ హెడ్స్ రాకుండా ఉండాలంటే?

ముక్కుపై చర్మరంధ్రాలు పెద్దగా ఉండటంతో నూనెలు, మృతకణాలు చేరి వైట్హెడ్స్ ఏర్పడతాయి. హార్మోన్ల మార్పులు, ఒత్తిడి వీటికి కారణమంటున్నారు నిపుణులు. వీటిని తొలగించడానికి మినరల్ కాస్మెటిక్స్, టోనర్, మైల్డ్ క్లెన్సర్ వాడాలి. వారానికి 3సార్లు తలస్నానం చేయాలి. ఫోన్, పిల్లో కవర్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. మేకప్ ప్రొడక్ట్స్ ఎవరితోనూ పంచుకోకూడదు. అయినా తగ్గకపోతే వైద్యుల సలహాతో యాంటీ బయాటిక్స్ వాడాలి.
News October 17, 2025
ప్రతి మండలానికి లైసెన్సుడ్ సర్వేయర్లు: శ్రీనివాసరెడ్డి

TG: భూసేవలు సులభంగా అందేలా మండలానికి 4-6 మంది లైసెన్సుడ్ సర్వేయర్లను నియమిస్తున్నామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూభారతి చట్టం అమలుకు ఇపుడున్న 350 మంది సర్వేయర్లు సరిపోరని అందుకే కొత్తగా 3465 మందిని తీసుకున్నామని చెప్పారు. శిక్షణ పొందిన వీరికి ఈనెల 19న CM ద్వారా లైసెన్సులు అందిస్తామని చెప్పారు. మరో 3వేల మందికి JNTU అర్హత పరీక్ష నిర్వహిస్తుందని, ఎంపికైన వారికి అప్రెంటీస్ శిక్షణ ఉంటుందన్నారు.
News October 17, 2025
దేశ అభివృద్ధికి యువతే వెన్నెముక: కలెక్టర్

భారతదేశ అభివృద్ధికి యువతే వెన్నెముకని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. యువతలోని శక్తి, మేధోసంపత్తి సమాజానికి ఎంతో ఉపయోగపడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా యువజన వ్యవహారాల శాఖ స్టెప్ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలులోని స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. యువత దేశ ఉన్నతికి పాటుపడాలన్నారు.


