News February 28, 2025
MHBD జిల్లా రైతుకు జాతీయ అవార్డు

మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామశివారు మేగ్యాతండాకు చెందిన మిరపరైతు బోడ వీరన్నకు గురువారం జాతీయ ఉత్తమ రైతు అవార్డును ఢిల్లీలో కేంద్ర మంత్రి శోభఖరేండ్లజే అందజేశారు. భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ వారు అభివృద్ధి చేసిన అర్కతేజస్వి రకం మిరపరను వీరన్న తన వ్యవసాయభూమిలో సాగుచేసి ఎకరాకు 30 క్వింటాల దిగుబడి సాధించారు. ఈసందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
Similar News
News November 22, 2025
నట్స్తో బెనిఫిట్స్: వైద్యులు

నిత్యం స్నాక్స్గా ఉపయోగించే నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. రోజు కొన్ని నట్స్ తింటే పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 50% వరకు తగ్గించవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయన్నారు. వీటిలోని ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్.. ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, పేగుల ఆరోగ్యాన్ని బలపరుస్తాయని తెలిపారు. రోజూ కొన్ని నట్స్ తింటే చాలా మంచిదని పేర్కొంటున్నారు.
News November 22, 2025
రెండేళ్ల నుంచి పేలుళ్లకు సిద్ధమవుతున్నాం: షకీల్

ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. రెండేళ్లుగా పేలుళ్ల కోసం సిద్ధమవుతున్నట్టు ఒప్పుకున్నాడు. యూరియా, అమోనియం నైట్రేట్, 26 క్వింటాళ్ల NPK ఫెర్టిలైజర్, కెమికల్స్ నిల్వ కోసం డీప్ ఫ్రీజర్ను ముజమ్మిల్ కొనుగోలు చేశాడు. కుట్రకు నిందితులే రూ.26 లక్షలు సమకూర్చుకున్నారు. పేలుళ్లలో ఉమర్ మరణించగా, మిగతా నిందితులు కస్టడీలో ఉన్నారు.
News November 22, 2025
SRCL: మెరిసిన చీరలు.. మురిసిన మహిళలు

నేతన్నల చేతిలో నేసిన(మెరిసిన) స్వశక్తి చీరలు ఆడపడుచుల చేతికి అందడంతో మురిసిపోతున్నారని మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం ఏర్పాటు చేసిన ‘మహిళా ఉన్నతి- తెలంగాణ ప్రగతి’ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి MLA హజరయ్యారు. స్వశక్తి సంఘాల్లో సభ్యులుగా లేని మహిళలకు కూడా చీరలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.


