News April 15, 2025

MHBD జిల్లా రైస్ మిల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవిచంద్ర

image

మహబూబాబాద్ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డీఎస్ రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  మంగళవారం సుమారు 70 మందితో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఓలం కృష్ణమూర్తి నియామకమయ్యారు. తమ ఎన్నికలకు సహకరించిన జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ సభ్యులకు రవిచంద్ర ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News November 9, 2025

HEADLINES

image

* నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన PM మోదీ
* పెట్టుబడుల సాధనకు లోకేశ్ తీవ్ర కృషి: సీఎం చంద్రబాబు
* ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే తాట తీస్తాం: పవన్
* కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం: సీఎం రేవంత్
* రేవంత్ వ్యక్తిగత విమర్శలు చేసినా భయపడను: కిషన్ రెడ్డి
* వర్షం కారణంగా IND Vs AUS చివరి టీ20 రద్దు.. 2-1తో సిరీస్ భారత్ వశం
* స్థిరంగా బంగారం, వెండి ధరలు

News November 9, 2025

మాగంటి మృతిపై విచారణ జరపాలని తల్లి ఫిర్యాదు

image

TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై అనుమానాలున్నాయని ఆయన తల్లి మహానంద కుమారి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిపై విచారణ చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకుముందు మాగంటి మరణంపై సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ <<18218398>>కేటీఆర్‌ను<<>> ఆమె డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

News November 9, 2025

కమనీయంగా వేములవాడ రాజన్న కళ్యాణం

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్‌లో శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. భక్తి టీవీ కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు రాజన్న ఆలయ అర్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణం జరిపించారు.