News February 26, 2026
MHBD: ఢిల్లీ వేదికగా తాళ్లపూసపల్లి రైతుకు అవార్డు

కేసముద్రం మండలం తాళ్లపూస పల్లికి చెందిన రైతు జైపాల్ రెడ్డి జాతీయ వ్యవసాయ శాఖ అందజేసే ప్రతిష్టాత్మక ఫెల్లో ఫార్మర్ అవార్డు అందుకున్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, అగ్రికల్చర్ సెక్రటరీ చతుర్వేది, IARI శ్రీనివాస్ చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డు అందజేశారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు చైతన్య అవగాహన సదస్సుల నిర్వహించడం పట్ల జైపాల్ రెడ్డి ఈ గౌరవం పొందారు.
Similar News
News April 14, 2026
అభి‘షేక్’ చేస్తాడనుకుంటే.. సున్నాల్లో రికార్డ్

హిట్టర్ అభిషేక్ శర్మకు ఈ ఏడాది కలిసి రావట్లేదు. షేక్ చేస్తాడనుకుంటే ఇటీవల T20WC, ప్రస్తుతం ఐపీఎల్లో వరుసగా విఫలమవుతూ అప్పుడప్పుడూ మెరుస్తున్నారు. ఈ క్రమంలో T20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక <<19642127>>డకౌట్స్<<>>(18 ఇన్నింగ్సుల్లో ఏడుసార్లు) అయిన ఇండియన్ ప్లేయర్గా చెత్త రికార్డు నమోదు చేశారు. రోహిత్ 2018లో, సంజూ శాంసన్ 2024లో 32 ఇన్నింగ్సుల్లో ఆరుసార్లు సున్నాకు ఔటయ్యారు.
News April 14, 2026
ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్ణయం వెనక్కు తీసుకోవాలి: పొన్నం

ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలిపారు. విలీనం, కార్మిక సంఘాల అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, దీనిపై ఒక కమిటీ పని చేస్తోందని, ఉద్యోగులు సమస్యలు చెప్పుకునేందుకు ప్రభుత్వ తలుపులు తెరిచి ఉన్నాయని, మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
News April 14, 2026
IEBలో 28 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్(IEB), ముంబైలో 28 పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. వీటిలో మేనేజ్మెంట్ ట్రెయినీ-22, డిప్యూటీ మేనేజర్-5, చీఫ్ మేనేజర్-1 పోస్టులున్నాయి. 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, LLB/BE/B.Tech/PGతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం www.eximbankindia.in చూడండి.


