News March 19, 2025

MHBD: దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సౌకర్యాలను దివ్యాంగులకు అందించాలని, జిల్లా అడిషనల్ కలెక్టర్ లెనిన్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో మంగళవారం దివ్యాంగులకు ఉపకరణాలను అందించే కార్యక్రమంలో పాల్గొని, దివ్యాంగులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఆత్మ స్థైర్యం నింపారు. ఉచిత ఉపకరణాలను సరైన పద్ధతిలో వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఏడి రాజేశ్వరరావు, డీఎస్ఓ అప్పారావు, మోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 21, 2025

విశాఖ ‘ఖాకీ’లపై ప్రత్యేక నిఘా..!(1/2)

image

విశాఖలో దీర్ఘకాలంగా పాతుకుపోయిన కొందరు పోలీసు అధికారులు ఇష్టారీతిన వ్యవహిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులు అవినీతి పోలీసుల పనితీరుపై స్పెషల్ టీంతో నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీపీ దృష్టిలో ఏ అధికారిపై రిమార్క్స్ ఎక్కువ వచ్చాయి? ఎవరి మీద యాక్షన్ ఉంటుంది? అన్న భయం ఖాకీల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తోంది. మీ పరిధిలో పోలీసులు పనితీరుపై కామెంట్ చెయ్యండి.

News November 21, 2025

ప.గో: రూ. 2కోట్లు గోల్ మాల్ ?

image

తణుకులోని ఓ ప్రైవేటు బ్యాంకులో తాకట్టు బంగారం గోల్‌మాల్‌ అయిన వ్యవహారం రాజుకుంటోంది. గతంలో ఇక్కడ పనిచేసిన సిబ్బందితో చేతులు కలిపిన తణుకు శాఖ మేనేజర్‌ ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని సొంత అవసరాలకు వాడుకున్న వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఖాతాదారులు నిలదీయడంతో బ్యాంకు అధికారులు బయట బంగారం కొనుగోలు చేసి ఇచ్చారు. ఇలా సుమారు రూ.2 కోట్లు విలువైన బంగారాన్ని దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది.

News November 21, 2025

MBNR: ప్రయాణికురాలిగా బస్టాండ్‌లో ఎస్పీ పరిశీలన

image

మహబూబ్ నగర్ జిల్లాలోని ‘ప్రజా భద్రత–పోలీసు బాధ్యత కార్యక్రమం’ కొనసాగుతున్న సందర్భంలో జిల్లా ఎస్పీ డి.జానకి శుక్రవారం మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో సాధారణ మహిళలా నడుచుకుంటూ ప్రత్యక్ష పరిశీలనలు నిర్వహించింది. బస్టాండ్‌లో వేచి ఉన్న బాలికలతో, మహిళలతో వ్యక్తిగతంగా మాట్లాడి, ఎవరి నుండైనా వేధింపులు, అసౌకర్యాలు, అనుమానాస్పద ప్రవర్తన వంటి సమస్యలు ఎదురైతే వెంటనే ధైర్యంగా పోలీసులకు తెలియజేయాలన్నారు.