News March 15, 2025
MHBD: ధర్నాను జయప్రదం చేయాలి: కవిత

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా శనివారం ఉదయం 10 గంటలకు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి భారాస జిల్లా అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు సకాలంలో చేరుకుని దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News September 16, 2025
సూర్యను నీరజ్ చోప్రా ఫాలో అవుతారా?

ఆసియా కప్ మ్యాచ్ సందర్భంగా పాక్ కెప్టెన్కు భారత కెప్టెన్ సూర్య షేక్ హ్యాండ్ ఇవ్వని విషయం తెలిసిందే. ఇప్పుడు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై అందరి దృష్టి పడింది. రేపు, ఎల్లుండి టోక్యోలో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఒలింపిక్ ఛాంపియన్, పాక్ ప్లేయర్ అర్షద్ నదీమ్ను నీరజ్ ఎదుర్కోనున్నారు. మరి షేక్ హ్యాండ్ విషయంలో SKYని భారత త్రోయర్ ఫాలో అవుతారా అనే చర్చ మొదలైంది.
News September 16, 2025
ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి తుమ్మల

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారికంగా నిర్వహిస్తోంది. భద్రాద్రి జిల్లా కేంద్రంలో జరిగే ఈ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటారని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజలు హాజరుకావాలని కోరారు.
News September 16, 2025
ఏయూ: LAW కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్

ఈ విద్యాసంవత్సరానికి గానూ విశాఖలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ LAW లో కోర్సులకు ఏయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 ఏళ్ల LLB, 3 ఏళ్ల LLB, 2 ఏళ్ల పీజీ LLM కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ అడ్మిషన్లు కలవు. సెప్టెంబర్ 27వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. LAWCET/CLAT క్వాలిఫైడ్ విద్యార్థులకు ప్రాధాన్యం.