News March 19, 2025

MHBD: పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్

image

మహబూబాబాద్ జిల్లా పరిధిలో జరిగే పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ యాక్ట్ 2023 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల సందర్భంగా కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు ఇద్దరికీ మించి గుంపులుగా ఉండరాదని సూచించారు. అదేవిధంగా ఎలాంటి సభలు సమావేశాలు ర్యాలీలకు మైకులు డీజేలతో ఊరేగింపులు ధర్నాలు, ప్రచారాలు నిర్వహించొద్దని పేర్కొన్నారు.

Similar News

News March 21, 2025

బిచ్కుంద: 2024లో హత్య.. నేడు అరెస్టు

image

హత్య కేసులో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బిచ్కుంద సీఐ నరేశ్ తెలిపారు. శుక్రవారం బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్‌లో హత్య కేసు వివరాలను సీఐ వెల్లడించారు. బిహార్ చెందిన అంటుకుమార్ హస్గుల్‌లో మనీష్‌కు మద్యం తాగించి హత్య చేసి పరారయ్యాడు. బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామంలో 2024లో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ పేర్కొన్నారు.

News March 21, 2025

విశాఖ – భద్రాచలం ప్రత్యేక బస్సులు

image

శ్రీరామ నవమి సందర్భంగా విశాఖపట్నం నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని APSRTC జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 6 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయని ఆయన తెలిపారు. భక్తుల కోరిక మేరకు ద్వారకా బస్ స్టేషన్ కాంప్లెక్స్ నుంచి రాజమండ్రి మీదుగా నడుపుతున్నట్లు తెలిపారు.

News March 21, 2025

GREAT:TG ఖోఖో జట్టుకు ఎంపికైన అక్కాచెల్లెలు

image

ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ క్రీడలకు ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన గోపాలం, వెంకటమ్మ దంపతుల నలుగురు కూతుర్లు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టుకు అక్కాచెల్లెలు రూప(PD), దీప(SGT), శిల్ప(వెటర్నరీ అసిస్టెంట్), పుష్ప(PET) ఎంపికయ్యారు. నేటి నుంచి ఈనెల 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో వీరు పాల్గొంటారు. CONGRATULATIONS

error: Content is protected !!