News January 31, 2025
MHBD: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి స్నాక్స్

ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు ఈవెనింగ్ స్నాక్స్ అమలు చేయనుంది. ఇందుకు ఒక్కో విద్యార్థి కోసం రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. పల్లీపట్టి, బిస్కెట్లు, పకోడీ తదితరాలను అందించనున్నారు. జిల్లాలోని 3,727 మంది విద్యార్థులను గాను రూ.21,81,390 నిధులు మంజూరయ్యాయి. వీటిని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Similar News
News November 28, 2025
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అక్రమాలపై విచారణ జరపాలి: హరీశ్ రావు

వరంగల్లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకి మాజీ మంత్రి హరీశ్ రావు ఫిర్యాదు చేశారు. ప్రాణాలు కాపాడే వృత్తిలో అక్రమ మార్కులతో పాసై ప్రాణాలతో చెలగాటం ఆడే వారిపై, సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News November 28, 2025
బాపట్ల: వికటించిన నాటువైద్యం.. ఇంటర్ విద్యార్థిని మృతి

మేడికొండూరు(M) పేరేచర్లలో ఇంటర్ విద్యార్థిని(16) నాటువైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయింది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న బాలికకు, స్థానికుల సలహాతో ‘కొండపిండి ఆకు’ తినిపించారు. నాటు మందు కారణంగా కడుపునొప్పి తీవ్రమవ్వడంతో వెంటనే గుంటూరు GGHకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున బాలిక మృతి చెందింది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 28, 2025
జపాన్ కామెంట్స్ ఎఫెక్ట్.. ఫ్రాన్స్ మద్దతుకు ప్రయత్నిస్తున్న చైనా

జపాన్తో వివాదం ముదురుతున్న వేళ ఫ్రాన్స్ మద్దతు కోసం చైనా ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మద్దతుగా నిలబడాలని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ దౌత్య సలహాదారుతో చైనా దౌత్యవేత్త వాంగ్ ఇ చెప్పారు. ‘వన్-చైనా’ విధానానికి ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నట్టు చెప్పారు. ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చించడానికి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వచ్చే వారం చైనా వస్తున్నారు.


