News February 6, 2025
MHBD: ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గురువారం సందర్శించారు. ఆసుపత్రిలో పలు వార్డుల్లో తిరుగుతూ ఆసుపత్రిలో ఏమైన సమస్యలు ఉన్నాయా? అంటూ రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సేవలు అందించాలని కలెక్టర్ వైద్యులకు సూచించారు. అలాగే ఆసుపత్రిలో డెంటల్, ఫిజియోథెరపీ సేవలను అందించాలని పేర్కొన్నారు.
Similar News
News December 8, 2025
మూవీ ముచ్చట్లు

✦ ఈ నెల 12నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్న దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కాంత’
✦ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ నివేదా థామస్ సోదరుడు.. ‘బెంగళూరు మహానగరంలో బాలక’ సినిమాతో హీరోగా ఎంట్రీ.. పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్
✦ ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కానున్న అగస్త్య నరేశ్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘గుర్రం పాపిరెడ్డి’
News December 8, 2025
ఘోర అగ్నిప్రమాదంలో తాడేపల్లిగూడెం యువకుడి మృతి

అమెరికాలోని బర్మింగ్ హామ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. అందులో తాడేపల్లిగూడేనికి చెందిన అన్వేష్ రెడ్డి ఒకరు. ఘటనలో తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా వీరి కుటుంబం HYDలోని కూకట్ పల్లిలో నివాముంటోంది.
News December 8, 2025
విజయవాడ: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చర్లపల్లి(CHZ)- షాలిమార్(SHM)(నం.07148,49) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 9.35 గంటలకు CHZలో బయలుదేరే ఈ ట్రైన్ 9వ తేదీన ఉదయం 3.20కి విజయవాడ, రాత్రి 11.50 గంటలకు SHM చేరుకుంటుందన్నారు, 10న మధ్యాహ్నం 12.10కి SHMలో బయలుదేరి 11న ఉదయం 7.40కి విజయవాడ, సాయంత్రం 4 గంటలకు చర్లపల్లి చేరుకుంటుందన్నారు.


